Chandrababu: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం శ్రేణులను హర్ట్ చేస్తోందా? వరుసగా మూడో ఏడాది వారి సంతోషానికి బ్రేక్ పడిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి మే 28 సందర్భంగా ప్రతి ఏటా మూడు రోజులపాటు టీడీపీ మహానాడు నిర్వహిస్తుంటారు. పార్టీ శ్రేణులకు మహానాడు ఏటా ఒక పండుగ. అయితే, ఆ విషయంలో టీడీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కల్లోలం వల్ల ఈ సంవత్సరం కూడా వర్చువల్గానే మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
అసలు బాధ అది…
కరోనా వల్ల గత ఏడాది 2 రోజులపాటు వర్చువల్గా మహానాడు నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ముఖ్య నేతలు ఆన్లైన్లో మహానాడులో పాల్గొనగా, మిగతా నాయకులు, కార్యకర్తలు తమ స్వస్థలాల నుంచి పాల్గొన్నారు. ఇప్పుడు సైతం కరోనా నేపథ్యంలో అదే రీతిలో ఆన్లైన్లో నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే, గత ఏడాది వలే ఈ సంవత్సరం మహానాడు 2 రోజులు నిర్వహించాలా? లేదంటే మే 28న ఒక్కరోజే నిర్వహించాలా? అనే విషయంలో నేడు క్లారిటీ రానుంది.
ఎన్నికల ఫలితాల సమయంలో కూడా
మహానాడు విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2019లో కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే ఎన్నికలు జరగడం, ఫలితాలపై ఆశావహ పరిస్థితులు లేకపోవడంతో మహానాడు నిర్వహించలేదు. దీనికి పలు కారణాలు పేర్కొన్నారు. దాని తర్వాత 2020లో కరోనా, అనంతరం మళ్లీ ఈ ఏడాది సైతం అదే కారణం ఉండటంతో టీడీపీ శ్రేణులు హర్టవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?