NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Atmakur By Poll: ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్.. పోలింగ్ శాతం ఎంత అంటే..?

Atmakur By Poll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకూ 61.75 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఆరు గంటల వరకూ క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటింగ్ కు అనుమతి ఇచ్చారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆరు గంటల తరవాత కూడా క్యూలైన్ లలో ఓటర్లు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం పోలింగ్ కేంద్రాల్లో ఆరు గంటల సమయానికే ఖాళీగా ఉండటంతో పోలింగ్ కేంద్రాలను అధికారులు మూసివేసి ఈవీఎంలను తరలించే ప్రక్రియను ప్రారంభించారు. పలు పోలింగ్ కేంద్రాల సమీపంలో వైసీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.

Atmakur By Poll ended peacefully
Atmakur By Poll ended peacefully

ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ, జనసేన లు పోటీలో లేకపోవడంతో వైసీపీ మెజార్టీ అంచనాలపైనే లెక్కలు వేసుకుంటోంది. ఎన్నికల బరిలో వైసీపీ, బీజేపీతో సహా 14 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా భరత్ కుమార్ యాదవ్ లు రంగంలో ఉన్నారు. వైసీపీ ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీని సాధించాలన్న లక్ష్యంతో ఉంది. 70 శాతంకుపైగా పోలింగ్ నమోదు అవుతుందని వైసీపీ వర్గాలు భావించినా 62, 63 శాతం మించే పరిస్థితి లేదు. ఆత్మకూరు మండలం బట్టేపాడు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులకు, స్వతంత్ర అభ్యర్ధి శశిధర్ రెడ్డికి మధ్య వాగ్వివాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దే ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.

 

ఉప ఎన్నికల సందర్భంలో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపించారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఏజెంట్ విష్ణును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ, ఎలక్షన్ కమిషనర్ కు దృష్టికి తీసుకువెళ్లినట్లు బీజేపీ నేతలు తెలిపారు. పడమటి నాయుడుపల్లి పోలింగ్ కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా ప్రజలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయగా వారు పోలీసులపై ఎదురుదాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ వెంటనే పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. మొత్తం మీద పోలింగ్ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju