Chandrababu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఆ పా్రీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? బాస్ ఆర్డర్ తో క్యాడర్ ఇరుకున పడుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను అధికార పార్టీ నేతలు సీరియస్గానే తీసుకున్నారు. వైసీపీ నాయకులు ఏకగ్రీవాలపై ఫోకస్ పెట్టారు. మరోవైపు టీడీపీ మద్దతుదారులు బరిలో దిగుతున్నారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంటోందని సమాచారం.
Chandrababu చంద్రబాబు ఒత్తిడితో….
పంచాయతీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం నేతలతో కాన్ఫరెన్స్లు పెడుతూ శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీపై, పోరాటంపై దిశానిర్దేశం చేస్తున్నారు కూడా. టీడీపీ అధిష్ఠానం పంచాయతీ ఎన్నికల్లో గట్టిగా పోరాడమని సూచించడం వల్ల గ్రామస్థాయిలో పంతాలకు ఎక్కవ ప్రాధాన్యం ఇచ్చే నేతలు పోటీకి సై అంటున్నారు. అయితే అనేకమంది నాయకులకు చిత్రమైన సమస్యలు ఎదురవుతున్నాయట ముఖ్యంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉండటం , పార్టీ పెద్దలు పైసా కూడా విదిల్చే ప్రయత్నం చేయకపోవడం.
అర్థం చేసుకోండి చంద్రబాబు గారు…
పంచాయతీ ఎన్నికల్లో పోటీ పెట్టాల్సిందే అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆర్డర్ పై క్యాడర్ ఫీల్ అవుతున్నారట. ఎన్నికలు అంటేనే భారీ ఖర్చుగా మారిపోయిన తరుణంలో.. చాలా మంది తమ ఆర్థిక పరిస్థితి తలచుకుని ఆందోళన చెందుతున్నారని సమాచారం. గత ఎన్నికల ముందు చేసిన ఉపాధి హామీ పనుల బిల్లులు రాకపోవడం వారిని ఇప్పటికీ ఇబ్బంది పెడుతోంది. అయితే, టీడీపీ పెద్దలు పైసా ఇవ్వకపోవడంతో ఎలా ఎన్నికల బరిలో దిగాలని తమ్ముళ్లు వర్రీ అవుతున్నారట. ఆర్థికంగా ఎలాంటి సహాయం చేయకుండా ఎన్నికల బరిలో పోరాటం చేయమంటే ఎలా అంటూ నాయకులు అంతర్గత సంభాషణల్లో వాపోతున్నారంటున్నారు.