YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ క్యాడర్ తో సమావేశమైయ్యారు. అద్దంకి లో ఖచ్చితంగా ఈ సారి వైసీపీ గెలవాల్సిందేనని చెప్పారు. ఈ నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు గొట్టిపాటి రవికుమార్ విజయం సాధిస్తూ వచ్చారు. 2009లో కాంగ్రెస్ నుండి గెలిచిన గొట్టిపాటి వైఎస్ మరణానంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా టీడీపీ నుండి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
నేటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి జగన్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు క్యాడర్ ఇప్పటి నుండే సన్నద్దం చేయాలని జగన్ పిలుపు నిచ్చారు. ఎన్నికలు రేపు అన్నట్లుగా పని చేయాలన్నారు. కొద్దిగా కష్టపడితే అద్దంకిలో వైసీపీ గెలవడం పెద్ద కష్టం ఏమీ కాదని అన్నారు.అందరూ కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు వివరించాలని చెప్పారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081 కోట్లు వివిధ పథకాల రూపంలో అద్దంకి నియోజకవర్గంలోని 93,124 కుటుంబాలకు అందించామన్నారు. 47వేలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ పని తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని జగన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.ప్రతి గ్రామ సచివాలయానికి రూ.20లక్షలు కేటాయించామనీ, ప్రాధాన్యత గుర్తించి పనులు చేయించాలని తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ఆదేశించారు.
ఖర్గే ఘన విజయం .. 24 ఏళ్ల విరామం తర్వాత గాంధీ కుటుంబేతర నేత కాంగ్రెస్ బాస్ గా ఎన్నిక