Janasena: కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గుడ్ న్యూస్ అందించింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకే గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరో సారి గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల ఎన్నికల సంఘానికి ఆ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్ధులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు.
ఏపీలో 137 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో ఏడు లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ ఏపీ, తెలంగాణలో పోటీకి జనసేన సిద్దమవుతోంది. అయితే కొంత కాలం క్రితం జనసేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో జనసేన పార్టీకి ఇక గ్లాసు గుర్తు ఉండబోదంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంపై ఆ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. జనసేన పార్టీ తరుపన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈసీ జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించడంతో ఇప్పటి వరకూ దీనిపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.
AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా