Guntur Jinnah Tower: గుంటూరులో బీజేపీ లేవనెత్తిన దుమారానికి వైసీపీ మాస్టర్ ప్లాన్ తో తిప్పికొట్టింది. గత నెలలో బీజేపీ నేతలు గుంటూరు జిన్నా టవర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ, హిందూ సంఘాలు జిన్నా టవర్ పేరు మార్చాలని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జిన్నా టవర్ కు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని లేకుంటే టవర్ ను కూల్చేస్తామంటూ బీజేపీ నేతలు హెచ్చరించారు. దీనిపై ముస్లిం సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read More: YS Jagan: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగనన్న సర్కార్ గుడ్ న్యూస్(యే)..కానీ
Guntur Jinnah Tower: వ్యూహాత్మక అడుగులు
ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిన్నా టవర్ రక్షణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుక రోజున జిన్నా టవర్ పై జాతీయ జండా ఎగురవేసేందుకు హిందూ వాహిని సంఘం కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశంపైనా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో వివాద పరిష్కారానికి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేసింది.
Guntur Jinnah Tower: జిన్నా టవర్ కు జాతీయ జండా రంగులు
గుంటూరు నగర మేయర్ కావేటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, ఎమ్మెల్యే మద్దాలి గిరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లు ప్రత్యేక చొరవ తీసుకుని దగ్గర ఉండి జిన్నా టవర్ కు జాతీయ జండా రంగులు వేయించారు. ఈ నేతలు అక్కడి ముస్లిం మత పెద్దలతో సమావేశాన్ని నిర్వహించి మువ్వెన్నల రంగులను మార్చిన ప్రాధాన్యతను వివరించారు. ఈ నెల 3వ తేదీ గురువారం (నేడు) జిన్నా టవర్ వద్ద జాతీయ జండా ఎగురవేయనున్నట్లు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిన్నా టవర్ పేరు మార్పు వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు అయ్యింది. అయితే జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు వేయించడం పట్ల ఇది తమ విజయంగా ప్రకటించుకుంటోంది బీజేపి.