Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి కొత్త చర్చ. ఏపీలో ఇప్పుడు ఆయన్ను విలన్ ను చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా ఇతర విపక్ష నేతలు హీరోలుగా మారే ఎత్తుగడ తెరమీదకు వచ్చేసింది. ఇదంతా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి.
విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. స్టీల్ప్లాంట్లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన వస్తోంది.
Narendra Modi కేంద్రం ఏం చెప్తోంది?
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామని జనవరి 27వ తేదీన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరణకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుత ఉద్యోగులు, భాగస్వాముల కు సంబంధించిన అంశాలను ఒప్పందంలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవని, స్టీల్ ప్లాంట్ అమ్మకంపై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని ఆమె అన్నారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామని కేంద్ర ఆర్థిక మంత్రి క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు ఏపీలో రచ్చేనా?
కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఇప్పుడు ఏపీలో మరోమారు ఆందోళనలు ఉధృతం అవడం ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వేలాది మంది కార్మికుల జీవితాలను డోలయామనంలో పడేయనున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై విపక్ష పార్టీలు భగ్గుమనడం ఖాయమని అంటున్నారు.