NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాయలసీమలో డ్యామేజ్‌ను గోదావరిలో కవర్ చేసేసిన జగన్.. మళ్ళీ అధికారం పక్కనా..!

ఏపీలో అధికార వైసీపీకి రాయలసీమ కంచుకోట. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీని పెట్టినప్పటి నుంచి రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు జగన్‌కు కొమ్ముకాస్తూ వస్తున్నాయి. ఇక రాయలసీమ, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో ప్రతి ఎన్నికల్లోను వైసీపీ తన ఆధిక్యం చాటుకుంటూ వస్తోంది. ఒక 2014 సాధారణ ఎన్నికలలో మాత్రం అనంతపురం జిల్లాలో తెలుగుదేశం ఆధిక్యంలోకి వచ్చింది. కడప, కర్నూలు, చిత్తూరు మూడు జిల్లాల్లో ఎప్పుడూ వైసీపీకి తిరుగులేకుండా పోతుంది.

పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీకి అస్సలు తిరుగులేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు జిల్లాలలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం కేవలం మూడు స్థానాల్లో.. అదికూడా హిందూపురంలో బాలకృష్ణ, కుప్పంలో చంద్రబాబు, ఉరవకొండలో పయ్యావుల కేశ‌వ్‌ మాత్రమే విజయం సాధించారు. మిగిలిన 49 నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘనవిజయాలు సాధించారు. ఇక రాయలసీమలో ఉన్న ఎనిమిది పార్లమెంటు స్థానాలలో 8 చోట్ల కూడా వైసీపీ ఘనవిజయం సాధించింది.

దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లోను వైసీపీకి లక్ష ఓట్లకు పైనే మెజార్టీ రావడం విశేషం. అలాంటి కంచుకోటల‌లో ఈసారి పరిస్థితులు కొంచెం మారుతున్నాయి. జగన్ సొంత జిల్లా కడపలో మూడు నియోజకవర్గాలలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందని అనంతపురం, కర్నూలు జిల్లాలలో రెండు పార్టీలకు చెరి సగం సీట్లు వస్తాయని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా తెలుగుదేశం కచ్చితంగా ఐదు నుంచి ఏడు స్థానాలలో విజయం సాధిస్తుందని పలు సర్వేలు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంపై వైసీపీ వాళ్లకు కూడా క్లారిటీ ఉంది.

ఈసారి సీమలోని నాలుగు జిల్లాలలో తెలుగుదేశం 20 నుంచి 22 సీట్లలో విజయం సాధిస్తుందని వైసీపీలోనే కొందరు అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. అయితే రాయలసీమలో జరిగే డ్యామేజ్‌ను జగన్ చాలా వ‌ర‌కు ఉభ‌య‌ గోదావరి జిల్లాలలో కవర్ చేసుకుంటున్నారని.. ఇందుకు అదిరిపోయే ప్లానింగ్‌తో ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నారని తెలుస్తోంది. ఈసారి జగన్ గోదావరి జిల్లాలలో పూర్తిగా బీసీ ఈక్వేషన్ తో ముందుకు వెళుతున్నారు. ఏలూరు, నరసాపురం, రాజమండ్రి పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో శెట్టి బలిజలకు విశేష ప్రాధాన్యం కల్పించారు.

ఉమ్మడి తూర్పుగోదావరిలో 19, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15 మొత్తం 34 అసెంబ్లీ స్థానాలలో 12 నుంచి 15 స్థానాలలో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చాలా వ్యూహాత్మకంగానే జగన్ స్ట్రాటజీతో వెళ్లి రాయలసీమలో జరిగిన డ్యామేజ్ ను ఉభయగోదావరి జిల్లాలలో కవర్ చేసుకునేలా దాదాపు సక్సెస్ అయ్యారని.. వైసీపీ వాళ్ళు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే సీమ‌లో జరిగిన డ్యామేజ్ గోదావరిలో కవర్ చేసుకొని.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ బాటలు పరుచుకుంటున్నట్టు క్లియర్గా కనపడుతోంది.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N