తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి గన్ లైసెన్స్ రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని తనని చంపాలనుకుంటున్నారు అని ఆరోపించారు. అంత మాత్రమే కాక తాను పబ్లిక్ లోనే ఉంటానని ప్రజల మనిషిని చంపుతావా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చట్టాలు పరంగా కాకుండా పై నుంచి వచ్చే ఆదేశాల పరంగా పనిచేస్తున్నారని విమర్శించారు.
ఈ విధంగా పోలీస్ వ్యవస్థ ఉంటే కేసులు పెట్టినా ప్రయోజనం ఉండదని అందువల్ల తాను కేసు పెట్ట దలుచుకోలేదు అని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు పోలీస్ అధికారులు వింటున్నారని జెసి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సీసీ ఫుటేజ్ వీడియో ఆధారం చేసుకుని కేసు పెట్టమంటే.. పై నుండి ఒత్తిళ్లు వస్తున్నాయని పోలీసులు అంటున్నారని, ఒకవేళ కేసు పెడితే సస్పెండ్ అవటం గ్యారెంటీ అని పోలీసులు భయపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
పోలీస్ వ్యవస్థ మారాలి:-
ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా రాలేదు పోలీస్ వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన ఇంటికి మాట్లాడటానికి పెద్దారెడ్డి వచ్చినట్లు చెబుతున్నారు, అసలు మాట్లాడటానికి వచ్చేవాళ్ళు కత్తులు కటార్లు తో వస్తారా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసలు అతను చంబల్ లోయల్లో ఉండాల్సినవాళ్లు తాడిపత్రిలో ఉన్నారని విమర్శించారు. పార్నపల్లి, పెండెకల్లు, అచ్యుతాపురంలో దాడులు చేసి దోచుకున్నారని.., పెద్దారెడ్డిపై మండిపడ్డారు. తాడిపత్రి లో జరిగిన ఘటన పై కేసు పెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.
జగన్ ఆఫీస్ కి జెసి వర్గం:-
ఇదిలా ఉంటే పోలీసులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి తో పాటు ఆయన కుమారుడు పై కూడా కేసులు పెట్టినట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ విషయం గురించి డైరెక్ట్ గా సీఎం జగన్ తో మాట్లాడే ఆలోచనలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఉన్నట్లు అనంతపురం జిల్లా రాజకీయాలలో వార్తలు వస్తున్నాయి. దీంతో నేరుగా జగన్ ఆఫీస్ కి వెళ్లి అనంతపురం జిల్లాలో పరిస్థితిని వివరించి పూర్తిగా రెండు వర్గాలను శాంతింపజేసే రీతిలో జెసి వర్గం ఆలోచన చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖను కూడా ప్రభుత్వ సలహాదారులు కంట్రోల్ చేసే రీతిలో పరిస్థితి ఉండటంతో జేసీ వర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తాడేపల్లి జగన్ ఆఫీస్ కి జెసి వర్గం వెళ్తే మాత్రం ఖచ్చితం వైసీపీ ప్రభుత్వానికి ఊహించని సీన్ అవుతుందని పరిశీలకులు అంటున్నారు.