నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. నిన్న ఇవేళ గన్నవరం నియోజకవర్గంలో కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుండగా, బాపులపాడు మండలంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఫ్యూచర్ సీఎం..జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అటు గుంటూరు, ఇటు విజయవాడ లో ఇద్దరు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని లు లోకేష్ యువగళం పాదయాత్ర వైపు చూడకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా నిన్న గన్నవరంలో కేడీసీసీ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆనంతరం లోకేశ్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి గన్నవరం లో జరిగిన బహిరంగ సభలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు పాల్గొన్నారు.
BRS: బీఆర్ఎస్ ను వీడేందుకు మైనంపల్లి సిద్దమైనట్లే(గా)..?