MLC Anantababu: ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంత బాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వద్ద అనంత బాబు ఇచ్చిన వ్యాంగ్మూలంకు భిన్నంగా పోస్టుమార్టం నివేదిక లో విషయాలు వెల్లడి కావడంతో ఆనంతబాబు పోలీసు అధికారుల వద్ద చెప్పింది అంతా కట్టుకథేనని వెల్లడి అవుతోంది. ఆనంత బాబు అరెస్టు చూపిన సందర్భంలో జిల్లా ఎస్పీ రవీంద్ర నాథ్ బాబు మీడియాతో మాట్లాడుతూ సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ ఆనంత బాబు బలంగా వెనక్కి నెట్టడంతో అతను డ్రైనేజీ పడటంతో తలకు బలమైన గాయమైందనీ, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళుతుండగా కారులోనే మృతి చెందాడని చెప్పారు. దీంతో ఈ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆనంత బాబు డ్రైవర్ సుబ్రమణ్యం మృతదేహాన్ని కింద ఉంచి చెట్టు కొమ్మలతో చేతులు, భుజం, తొడలు, వీపుపై బలంగా కొట్టారని ఎస్పీ చెప్పారు. పోలీసుల విచారణ సందర్భంలో ఆనంత బాబు చెప్పిన విషయాలను ఎస్పీ ఈ విధంగా వెల్లడించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
MLC Anantababu: మరణానికి ముందే గాయాలు
అయితే సుబ్రమణ్యం మృతదేహంపై ఉన్న గాయాలు అన్నీ అతని మరణానికి 24 గంటల లోపే తగిలాయని, బలమైన వస్తువులతో అతన్ని జీవించి ఉండగానే కొట్టడం వల్ల అతని శరీరంపై 31 గాయాలు అయ్యాయనీ, అంతర్గతంగా మరో మూడు గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. పోస్టుమార్టం నివేదికలో ఈ విధంగా ఉండటంతో డ్రైవర్ సుబ్రమణ్యం ను కఛ్చితంగా కొట్టే చంపేశారనీ, అందులో ఎటువంటి అనుమానం లేదనీ టీడీపీ, జనసేన శ్రేణులు పేర్కొంటున్నారు. ఎస్పీ చెప్పిన వివరాలకు, సుబ్రమణ్యం పోస్టుమార్టం నివేదికకు ఎక్కడా పోలికే లేదని అంటున్నారు. సుబ్రమణ్యం నోరు, కళ్లు కొద్దిగా తెరిచి ఉన్నాయి. శరీరంలో అంతర్గతంగా రక్తస్రావమైంది. ఊపిరితిత్తులు కూడా కొద్దిమేర సాగాయి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత అతను మృతి చెందాడు అని రంగరాయ వైద్య కళాశాల ఫొరెన్సిక్ మెడిసిన్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నివేదిక ఇచ్చారు.
MLC Anantababu: ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ కు శ్యాంపిల్స్
మరో పక్క సుబ్రమణ్యం శరీర అవయవాల్లోని చిన్న చిన్న ముక్కల నమూనాలుగా సేకరించి విజయవాడలోని ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ తో పాటు రంగరాయ వైద్య కళాశాలలోని పాథాలజీ ల్యాబ్ కు పరీక్షల కోసం పంపించారు. ఈ పరీక్షలు కూడా పూర్తి అయితే సుబ్రమణ్యం శరీరం లోపల ఇంకేమైనా భాగాలు దెబ్బతిన్నాయా లేదా అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నివేదికలు అధికారికంగా రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుంది. ఎస్పీ చెప్పిన మాటలకు, పోస్టుమార్టం నివేదికకు పొంతన లేకుండా ఉన్న నేపథ్యంలో దీనిపై ఎస్పీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాల నుండి డిమాండ్ వస్తొంది.