NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP DGP: రఘురామ మరో బాణం .. డీజీపీ పోస్టింగ్ పై కేంద్రం గురి..!

AP DGP: వైసీపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు మరో బాణం ఎక్కుపెట్టారు. ఇటీవల జగన్మోహనరెడ్డి సర్కార్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అర్ధాంతరంగా బదిలీ చేసి ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామకంలో సీనియారిటీని చూడకుండా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. సహజంగా ఆ స్థానంకు అర్హత ఉన్న అధికారులు తమకు ఆ పదవి రాకపోతే తమకు అన్యాయం జరిగింది అంటూ క్యాట్ కో, కోర్టుకో వెళుతారు. గతంలో ఆ విధంగా పలువురు అధికారులు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏపిలో మాత్రం ఇలాంటి అన్యాయంపై ఎవరూ నోరు మెదపలేదు.

Rebel MP Raghurama krishnam raju complaints on AP DGP post issue
Rebel MP Raghurama krishnam raju complaints on AP DGP post issue

AP DGP:  హోంశాఖ మంత్రి, యూపీఎస్సి కు లేఖ

అయితే ఐపీఎస్ అధికారులు ఎవరూ స్పందించకపోయినా రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు దీనిపై స్పందించారు. దాదాపు 12 మంది డీజీపీ స్థాయి అధికారులను కాదనీ కింద వరుసలో ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ హోదా ఎలా ఇచ్చారంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆయన హోంశాఖ మంత్రితో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేఖ రాశారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందిస్తుంటుంది. దానికి సంబంధించి వారి నుండి తాజాగా లేఖ రావడంతో రఘురామ మళ్లీ గళం విప్పడం చర్చనీయాంశం అయ్యింది. ఉన్నత స్థాయి పోలీస్ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. తాము చేయలేని పని ఓ ఎంపి చేశారని పలువురు సీినియర్లు సంబరపడుతున్నారుట.

CM YS Jagan 1000 Days: How Many Marks..!?

యూపీఎస్సీ నుండి ప్రభుత్వానికి లేఖ..?

సీఎం జగన్ తన సొంత జిల్లా, తన సామాజికవర్గం అన్న కోణంలోనే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పోస్టింగ్ ఇచ్చారని రఘురామ కృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిబంధనల ప్రకారం ముగ్గురు పేర్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుండి గానీ, యూపీఎస్సి నుండి గానీ స్పందన రాకపోతే కోర్టును సైతం ఆశ్రయించే యోచనలో రఘురామ కృష్ణంరాజు ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరో పక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి యూపిఎస్సీ నుండి లేఖ అందినట్లు తెలుస్తోంది. రఘురామ కృష్ణం రాజు లేఖపైనే యూపీఎస్సీ స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఉండవచ్చని భావిస్తున్నారు. యూపిఎస్సీ నుండి లేఖ అందితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ముగ్గురు లేదా అయిదుగురితో కూడిన అర్హుల జాబితాను యూపిఎస్సీకి పంపించాల్సి ఉంటుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju