Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రాగా.. సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ రైటర్ కె.విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి కథను అందిస్తున్నారు.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని మహేష్ బాబు అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఫ్యాన్స్ ఎగిరి గంతేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. మార్చి 25 ఈ మూవీ విడుదల కానుండగా.. ఆ వెంటనే రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్పై పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారట.
అలాగే మహేష్, రాజమౌళి కాంబినేషన్ మూవీ ఈ ఏడాది దసరా సందర్భంగా స్టార్ట్ చేయానున్నారని తాజా టాక్. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ భారీ ప్రాజెక్ట్ను ప్యాన్ ఇండియా లెవల్లో కాకుండా ప్యాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.
కాగా, మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలాగే మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇటీవలె ఈ మూవీ స్టార్ట్ చేశాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!