తెలంగాణ telangana రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారిలో రేవంత్ రెడ్డి revanth reddy అంటే తెలియని వారెవరు ఉండరు. అధికార టీఆర్ఎస్ trs పార్టీ ని ఆయన ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తుంటారు. అలాంటి రేవంత్ రెడ్డి revanth reddy గత కొద్దికాలంగా కీలక పరిణామంతో వార్తల్లో నిలుస్తున్నారు.
తెలంగాణ పీసీసీ telangana pcc president అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు పూర్తి చేసి రేపోమాపో అధికారక ప్రకటన వచ్చే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి congress working president revanth reddy కి ప్రమోషన్ దక్కనుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇదే సమయంలో రేవంత్ revanth reddy సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి revanth reddy పీసీసీ అధ్యక్షుడు ఎలాంటి వారు అయితే బాగుంటుంది.. ప్రచార కమిటీలో ఎలాంటి నేతలు ఉండాలనే దానిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమయంలోనే సంచలన కామెంట్లు చేశారు. పీసీసీ చీఫ్ పదవి తనకు తలకు మించిన భారం అంటూనే.. పార్టీ అప్పగిస్తే ఆ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ revanth reddy తెలిపారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా.. ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానంటూ కాంగ్రెస్ congress పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో congress party ఎవరెవరు ఏ పాత్ర పోషించాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి revanth reddy.. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులు చాలా కీలకమని తెలిపారు.
రేవంత్ రెడ్డి revanth reddy కీలక నిర్ణయం ?
తన ముందు పీసీసీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులు పెట్టి.. ఏం కావాలని అడిగితే మాత్రం.. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవినే తాను కోరుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ పగ్గాల కంటే.. ప్రచార కమిటీ చైర్మన్ పదవి బాగా ఇష్టం అంటూ కీలక కామెంట్లు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా చిన్న నేతల నుంచి తన కంటే సీనియర్ నేతల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుందని.. దీనికి ఎంతో ఓపిక అవసరమని రేవంత్ అభిప్రాయపడ్డారు. అదే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవిని తనకు అప్పగిస్తే.. క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి సమస్యలపై పోరాటం చేయవచ్చు అన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి . పదవుల కోసం చాలా పోటీ నెలకొన్న తరుణంలో రేవంత్ రెడ్డి revanth reddy కీలక మాటలు చెప్పడం సంచలనంగా మారింది.