మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగానే ఉంటూ మరోపక్క సినిమాలు చేస్తూ ఉన్నాడు. దాదాపు రెండు సంవత్సరాలు పవన్ సినిమాలు చేయకపోవడంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కి పోటీగా చిరంజీవి కూడా సినిమాలు లైన్లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య ఇంకా సెట్స్ మీదనే ఉంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి వేదాళం, లూసీఫర్ సినిమాలను రీమేక్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇంకా తమ ఆకలి తీరలేదు అన్నట్టుగా మరో డైరెక్టర్ తో స్టోరీ నరేషన్ చేయించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.
మేటర్ లోకి వెళ్తే సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, పవర్ సినిమాలతో పాపులర్ అయిన డైరెక్టర్ బాబి చిరుతో సినిమా చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. అంతేకాకుండా రీసెంట్ గా చిరంజీవి కి స్టొరీ నరేషన్ ఇవ్వటం.. చిరంజీవి కూడా ఓకే అన్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో బాబీ తో కూడా చిరంజీవి ఈ ఏడాదిలోనే సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుదిరితే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు సంక్రాంతికి మొదలుపెట్టి.. మధ్యలో ఖాళీ దొరికితే ఈ సినిమా కంప్లీట్ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!