RTC Employees: పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన చలో విజయవాడ సక్సెస్ అయ్యింది. పోలీసు యంత్రంగం ముందస్తు నిర్బంధాలు, ఎక్కడికక్కడ అరెస్టులు చేసినప్పటికీ వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్యోగులను ఉద్దేశించి పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఒక చరిత్ర అని, ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు. ఈ నెల 7వ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు బొప్పరాజు. ఈ నెల 5వ తేదీ నుండి ప్రభుత్వానికి సహాయ నిరాకరణను తెలియజేస్తాామని నేతలు పేర్కొన్నారు.
RTC Employees: పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ ఉద్యోగులు షాక్
అయితే ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నాటి నుండి ప్రభుత్వం ఉద్యోగుల్లో చీలక తీసుకురావడానికి ప్రయత్నిస్తుందన్న వార్తలు వినబడుతునే ఉన్నాయి. ఆ ప్రయత్నాలు ఓ రకంగా ఫలించినట్లుగానే కనబడుతున్నాయి. ఏపిఎస్ ఆర్టీసీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మాత్రం పీఆర్సీ సాధన సమితికి షాక్ ఇచ్చేలా నిర్ణయాన్ని తీసుకున్నారు. తాము సమ్మెలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.
జగన్ తమకు మంచే చేశారు
తాము సమ్మెలో పాల్గొనబోమని, సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని వారు తెలిపారు,. ఈ మేరకు వారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి లేఖ అందజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం వైఎస్ జగన్ తమకు మంచే చేశారనీ, కరోనా సమయంలో ఆరు నెలలు ఇంట్లోనే ఉన్నా జీతాలు సక్రమంగా ఇచ్చారనీ ఇలాంటి మంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో తాము పాల్గొనబోమని లేఖలో పేర్కొన్నారు.