ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు ప్రారంభమైయ్యయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు ప్రారంభమైయ్యాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలంటూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం ను చుట్టుముట్టి టీడీపీ ఆందోళనకు దిగింది. సీఎం ఢిల్లీ వెళ్లి ఏమి సాధించుకొచ్చారంటూ నిరసనకు దిగారు.
వెనకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందంటూ ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు లో సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎం జగన్ కు ఢిల్లీ గుర్తుకొస్తుందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని ఆయన మండిపడ్డారు. టీడీపీ సభ్యుల ఆందోళన పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. సీఎం ఢిల్లీ టూర్ పై వాయిదా తీర్మానం ఇస్తారా.. అసలు వాయిదా తీర్మానం అర్ధం తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు 35 సార్లు ఢిల్లీ వెళ్లారనీ, ఆ 35 సార్లుపై చర్చిద్దామా.. టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా.. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, పెట్టిన బకాయిలపై చర్చిద్దామా అంటూ మంత్రి బుగ్గన సవాల్ విసిరారు.
టీడీపీ సభ్యుల సభ్యుల నిరసన మద్యే ప్రశ్నోత్తరాలలో భాగంగా ఉద్దానం సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి విడతల రజిని సమాధానం ఇస్తున్నారు. మంత్రి సమాధానం కొనసాగుతుండగానే స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ వాయిదా తీర్మానాన్ని అనుమతించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడంతో ఆ కాగితాలను చించి గాల్లోకి విసురుతూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభా కార్యక్రమాలను పదేపదే అడ్డుకుంటున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని ఒక్క రోజు పాటు సస్పెండ్ చేసారు. అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చిన రాజప్ప, బెందాళం అశోక్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు.
నాలుగేళ్లలో మొదటి సారి టీడీపీలో ఉత్సాహం .. రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయంతో..