NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీ నుండి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు ప్రారంభమైయ్యయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు ప్రారంభమైయ్యాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలంటూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం ను చుట్టుముట్టి టీడీపీ ఆందోళనకు దిగింది. సీఎం ఢిల్లీ వెళ్లి ఏమి సాధించుకొచ్చారంటూ నిరసనకు దిగారు.

suspension of tdp members from ap assembly andhrapradesh

 

వెనకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందంటూ ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు లో సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎం జగన్ కు ఢిల్లీ గుర్తుకొస్తుందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని ఆయన మండిపడ్డారు. టీడీపీ సభ్యుల ఆందోళన పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. సీఎం ఢిల్లీ టూర్ పై వాయిదా తీర్మానం ఇస్తారా.. అసలు వాయిదా తీర్మానం అర్ధం తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు 35 సార్లు ఢిల్లీ వెళ్లారనీ, ఆ 35 సార్లుపై చర్చిద్దామా.. టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా.. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, పెట్టిన బకాయిలపై చర్చిద్దామా అంటూ మంత్రి బుగ్గన సవాల్ విసిరారు.

టీడీపీ సభ్యుల సభ్యుల నిరసన మద్యే ప్రశ్నోత్తరాలలో భాగంగా ఉద్దానం సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి విడతల రజిని సమాధానం ఇస్తున్నారు. మంత్రి సమాధానం కొనసాగుతుండగానే స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ వాయిదా తీర్మానాన్ని అనుమతించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడంతో ఆ కాగితాలను చించి గాల్లోకి విసురుతూ టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభా కార్యక్రమాలను పదేపదే అడ్డుకుంటున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని ఒక్క రోజు పాటు సస్పెండ్ చేసారు. అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చిన రాజప్ప, బెందాళం అశోక్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు.

నాలుగేళ్లలో మొదటి సారి టీడీపీలో ఉత్సాహం .. రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయంతో..

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N