Mekapati Goutam Reddy: ఏపి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మృతికి సంతాప సూచకంగా ఏపి సర్కార్ రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాదా లోని అపోలో ఆసుపత్రి నుండి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి తరలించారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరారు. మరి కొద్ది సేపటిలో జూబ్లిహిల్స్ లోని మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసానికి చేరుకుని నివాళులర్పించనున్నారు.
Read More: Big breaking: మంత్రి మేకపాటి గుండెపోటుతో మృతి
Mekapati Goutam Reddy: ప్రముఖుల నివాళి..
మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్, ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఏపి, తెలంగాణకి చెందిన పలువురు మంత్రులు, సినీ రంగ ప్రముఖులు మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మేకపాటితో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు తమ సంతాప సందేశాల్లో వెల్లడించారు. గౌతమ్ రెడ్డి కుమారుడు చదువు నిమిత్తం అమెరికాలో ఉంటున్నారు. అతను వచ్చిన తరువాత అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉండటంతో ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం గౌతమ్ రెడ్డి పార్ధివ దేహాన్ని నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లికి తరలించి అభిమానుల సందర్శనార్ధం రేపంతా అక్కడే ఉంచనున్నారు. ఎల్లుండి (బుధవారం) అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.