YSRCP: అధికార వైసీపీ గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తొంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను నియమించిన వైసీపీ.. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ల పరిస్థితిపై అంచనాలకు వచ్చి వారి స్థానాల్లో కొత్త ఇన్ చార్జిల నియామకానికి చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని పత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పినట్లుగా తెలుస్తొంది. ఆ ఎమ్మెల్యేలను అమరావతికి పిలిపించి పార్టీ పరిశీలకుడు ఈ విషయాన్ని నింపాదిగా చెప్పారుట. కొత్త నియమితులు అవుతున్న ఇన్ చార్జిలకు సహకరించాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలేకు ఆదేశించినట్లుగా తెలుస్తొంది. అయితే ఈ పరిణామాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారుట.
అధిష్టానం నిర్ణయంపై వారు ఆగ్రహం గా ఉన్నట్లు సమాచారం. అధిష్టానం సీటును నిరాకరిస్తుందని తెలియడంతో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు తన అనుచరవర్గంతో సమావేశం నిర్వహించారు. జగ్గంపేట సీటు తనకు ఖాయమని మరో పక్క మాజీ మంత్రి తోట నరసింహం ప్రకటించుకున్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ నిర్ణయానికి వీరు బద్దులై ఉండి సహకరిస్తారా .. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాదిరిగా కీలక నిర్ణయాలను తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత వైసీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరడంతో చంటి బాబు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికలకు వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి చంటి బాబు విజయం సాధించారు. గోదావరి జిల్లాల్లో టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధులు పోటీ చేసే అవకాశం ఉండటంతో బలమైన బీసీ నేతలను రంగంలోకి దింపాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా సమాచారం.
Telangana Assembly: శాసనసభలో వాడివేడిగా చర్చ .. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్