జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేసిన సంచలన కామెంట్స్ ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీలో ఎవరూ శాశ్వతం కాదని అన్నారు. ఇప్పుడున్న వారు రేపు మరో పార్టీలో ఉంటారని చంటిబాబు వ్యాఖ్యానించారు. తాము కూడా పార్టీలో ఏమైనా శాశ్వతంగా ఉంటామా అని ప్రశ్నించారు. రేపన్న రోజు ఎవరు ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో తెలియదని వ్యాఖ్యానించారు జ్యోతుల చంటిబాబు. చంటిబాబు వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోంది, జ్యోతుల చంటిబాబు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తొంది. మరో పక్క అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కూడా తనకు సహకరించడం లేదన్న అసహనంలో ఆయనలో ఉందని అంటున్నారు.
టీడీపీ, జనసేన విమర్శలు చేస్తుండటంతో జ్యోతుల చంటిబాబు అసహనానికి గురై ఈ వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. అందుకే పార్టీలో ఎవరూ శాశ్వతం కాదన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. జ్యోతుల చంటిబాబు 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన చంటిబాబు..వైసీపీ నుండి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూపై 23వేల మెజర్టీతో విజయం సాధించారు.
తొందరపడిన ఓ కోయిల ముందే కూసింది..