Vijaya Sai: దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ పేరిట ఈ రోజు రూ.100 స్మారక నాణెం విడుదల అయ్యింది. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, వివిధ పార్టీల ఎంపీలు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు హజరైయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ముందు తన పేరుతో అందరికీ ఆహ్వానాలు పంపిన దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శనాత్మక ట్వీట్ చేశారు.
1/2. పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!
a) వాటాలు తేల్చుకోలేక మద్రాసులో ఎన్టీఆర్ ఇల్లు పాడు పెట్టేశారు.
b) అబిడ్స్ లో అయన ఇల్లు అమ్ముకున్నారు. c) బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు.
d) దానికి ఎదురు ఉన్న అయన ఇంట్లో మ్యూజియం పెట్టాలనుకున్నారు. అయన ఆశయాలకు నీళ్ళుకొట్టారు.
2/2. తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో హృదయ అంతరంగం నుంచి రావాలేకానీ…పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా!
e) సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణెం అంటారు.
f) భారతరత్న గురించి మీరు ఢిల్లీలో ఏనాడు అడగలేదు. రాజకీయ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అప్పటి మీ నాయకురాలు సోనియాకు మీరు చెప్పిన హృదయపూర్వక కృతఙ్ఞతలు మరచిపోలేమమ్మా!
‘ఎన్టీఆర్ గారు ప్రేమతో చూసుకున్న అబిడ్స్ ఇల్లు విజయ్ ఎలక్ట్రికల్స్ రమేశ్ గారికి కేవలం 4 కోట్లకు అమ్ముకున్నారు. వీళ్ళ దగ్గర నాలుగు కోట్లు కూడా లేవా? అది నందమూరి రామకృష్ణ గారి వాటాకు వచ్చింది. చంద్రబాబు లేక పురంధ్రీశ్వరి ఆ ఇంటిని కొని ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా వుంచవచ్చుగా! ఆయన మీద మీకున్న నిజమైన ప్రేమకు అద్దం పడుతుంది’ అన్నారు విజయసాయిరెడ్డి.
ఈ ట్వీట్ తో పార్లమెంట్ భవనంలో 2013 మే 7న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నాటి లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ లకు పురందేశ్వరి కృతజ్ఞతలు తెలియజేస్తూ పంపిన ఇన్విటెషన్ , మద్రాస్ లోని ఎన్టీఆర్ ఇల్లు నేటి దుస్థితి అంటూ ఓ వీడియోను ట్యాగ్ చేశారు విజయసాయి రెడ్డి.
విరాట్ కొహ్లీ ట్వీట్ రికార్డు బద్దలు కొట్టిన చంద్రయాన్ – 3 సందేశం