Adala Prabhakar Reddy: నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల ముందు వరకూ టీడీపీలో ఉన్నారు. నెల్లూరు రూరల్ అభ్యర్ధిత్వాన్ని ఆయనకు టీడీపీ అధిష్టానం ఖరారు చేసిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా చివరి నిమిషంలో వైసీపీలో చేరి నెల్లూరు నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఆయనను నెల్లూరు రూరల్ పార్టీ ఇన్ చార్జిగా నియమించింది.
నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. విస్తృతంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే ఆదాల మళ్లీ పార్టీ మారనున్నారు అంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానే గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి.
తనపై విపక్షాలు,, రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీ అధిష్టానా¬న్ని కలి¬సినట్లు, ఆ పార్టీ¬లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అన్నారు. ఎంపీ టికెట్ ఇవ్వడంతో గెలిచి సేవలు అందించానని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించి పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిందన్నారు. ఇంత ప్రాధాన్యం ఇస్తున్న వైసీపీని వదిలి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు.
రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక కొందరు కిరా¬యి మూకలను నియమించుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అత్యంత బలంగా ఉండటంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. వీటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ మారే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానని ఆదాల స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు మరోసారి ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.