YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్ భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టు ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగిసింది. దీంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 20 వరకు సీబీఐ కోర్టు రిమాండ్ విధించడంతో అధికారులు భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైల్ కు తరలించారు. అనారోగ్య కారణాలతో వైఎస్ భాస్కరరెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన సీబీఐ కోర్టు సెప్టెంబర్ 22వ తేదీన తొలుత 12 రోజులు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ వదిలివెళ్లకూడదని కండిషన్ పెట్టింది.
ఎస్కార్ట్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కంటి శస్త్ర చికిత్స చేయించుకున్న భాస్కరరెడ్డి వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నందున ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఇలా రెండు మూడు పర్యాయాలు పిటిషన్లు దాఖలు చేయగా విచారణ జరిపిన సీబీఐ కోర్టు..ఎస్కార్ బెయిల్ పొడిగిస్తూ వచ్చింది. ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు పిటిషన్ పై గత నెలలో జరిగిన విచారణ సందర్భంలో సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఎస్కార్ట్ బెయిల్ గడువు ను సీబీఐ పొడిగించలేదు. దీంతో ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగియడంతో వైఎస్ భాస్కరరెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 20 వరకూ సీబీఐ కోర్టు రిమాండ్ విధించగా, సీబీఐ అధికారులు ఆయనను చంచల్ గూడ జైల్ కు తరలించారు.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ నిందితుడుగా చేర్చిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటే ఉన్నారు. వైఎస్ భాస్కరరెడ్డిని మాత్రం సీబీఐ అరెస్టు చేసి చంచల్ గూడ జైల్ కు తరలించింది. ఆయన పలు పర్యాయాలు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందారు భాస్కరరెడ్డి. సెప్టెంబర్ 22 నుండి నవంబర్ 30ద వరకూ వైఎస్ భాస్కరరెడ్డి ఎస్కార్ట్ బెయిల్ పై ఉన్నారు.
KRMB: ఏపీ సర్కార్ కు కేఆర్ఎంబీ (కృష్ణాబోర్డు) కీలక ఆదేశాలు