Naga Panchami: కరాలి అగ్నిలో ఆహుతి అయిపోతుంటే మహాకాళి ప్రత్యక్షమవుతుంది. నన్ను ఎందుకు బ్రతికించారు మహాకాళి అని నీలాంబరి అంటుంది. నువ్వు ఊహించుకున్నట్టు మోక్ష పంచమి ల కలయిక ఏమీ జరగలేదు అని మహాకాళి అంటుంది. నా కళ్ళతో నేను చూశాను మహాకాళి నా ఆశలన్నీ అడుగంటుకుపోయాయి ఇక నేను బ్రతకడం వృధా అని అంటుంది కరాలి. వాళ్లని ఒక గదిలోకి పంపించేంతవరకే నువ్వు చూసావు కదా ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియదు కదా నువ్వు మోక్షాన్ని వశం చేసుకోవడానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది కార్తీక పౌర్ణమి వచ్చాక ఆ నాగిని మోక్షాన్ని కాటు వేసి చంపేస్తుంది ఆ లోపే నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని మహాకాళి వెళ్ళిపోతుంది. కృతజ్ఞతలు మహాకాళి నన్ను కాపాడినందుకు నేను అనుకున్న పని సాధిస్తాను అని నీలాంబరి అంటుంది. కట్ చేస్తే,
కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది నేను సుబ్బు చెప్పినట్టు దీపం పెట్టి పరమేశ్వరుని వేడుకోవాలి అని అనుకుంటుంది పంచమి. ఇంతలో మోక్ష వచ్చి ఏం ఆలోచిస్తున్నావు పంచమి ఇక మనిద్దరి మధ్య దాపరికలేమీ లేవు అంతా తెలిసిపోయింది అని అంటాడు. ఏమీ లేదు మోక్ష బాబు మీకు తెలిసిందే కదా అని పంచమి అంటుంది. నువ్వు ఎంత ఆలోచించినా నా చావు మాత్రం తప్పకుండా వస్తుంది పంచమి కానీ ఆ లోపు మన ఇద్దరం ఒకటి కావాలి లేదంటే నా చావుకు అర్థం ఉండదు పంచమి నువ్వైనా ఈ భూలోకంలో సంతోషంగా నా రూపాన్ని చూసుకుంటూ బ్రతుకు అని మోక్ష అంటాడు. అదే జరిగితే ఒక్క సెకండ్ ముందే నేను మరణిస్తాను మోక్ష బాబు అని అంటుంది పంచమి. నేను ఒక బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నాను నువ్వేమో నీ ప్రాణం తీసుకుంటాను అంటున్నావ్ ఇదెక్కడి విచిత్రం పంచమి అని మోక్ష అంటాడు. మీరే లేనప్పుడు నేను ఉండడంలో అర్థం లేదు ఇదేనా నిర్ణయం అని పంచమి అంటుంది.అయితే నా నిర్ణయం కూడా విను పంచమి నేను బ్రతికేది కొన్ని రోజులే క్షణం ఒక యుగం లాగా గడిచిపోతుంది నేను చనిపోయిన నిన్ను బ్రతికించుకోవాలనేదే నా కోరిక ఈరోజే ఆ కార్యానికి ముహూర్తం ఇంక నువ్వు నాకు ఏమీ చెప్పకు పంచమి అని మోక్ష అంటాడు. ఇంతలో పంచమి వాళ్ళ అమ్మ వచ్చి నేను వెళ్లి వస్తాను పంచమి జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. అత్తయ్య నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని మోక్ష తీసుకువెళ్తాడు.
కట్ చేస్తే, ఇంతలో ఫణేంద్ర వచ్చి చూడు పంచమి నీ విషయాలన్నీ నాకు తెలిసి పోయాయి వెంటనే నేను మన నాగులోకానికి వెళ్లి నాగదేవతకు చెప్పాను నాగదేవత నాకు మోక్షాన్ని కాటు వేసే ఆజ్ఞ ఇచ్చింది ఇకమీదట మోక్ష నీ మీద చెయ్యి వేస్తే కాటు వేసి చంపే అధికారం నాకు ఉంది అది గుర్తుపెట్టుకో పంచమి అని ఫణేంద్ర వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే, నీలాంబరి నంబూద్రి ఆత్మను పిలిచి అన్నయ్య నిన్ను కాపాడడానికి మోక్షని వశం చేసుకోవడానికి వెళుతున్నాను కొన్నాళ్లు నీ దేహాన్ని కంత్రి తంత్రి పసర్లు ప్పుస్తూ కాపాడుతూ ఉంటారు నువ్వు నీ ఆత్మ దగ్గర ఉండి ఏ దుష్టశక్తులు దగ్గరికి రాకుండా చూసుకో అన్నయ్య అని అంటుంది. చూడు నీలాంబరి కొంతకాలం వరకే పసర్లు పూసిన నా దేహం ఉండగలుగుతుంది సమయం మించి పోతే నా దేహం శిధిలమైపోతుంది అప్పుడు నువ్వు నాగమణి నీ సంపాదించిన నన్ను బ్రతికించలేవు అని నంబూద్రి అంటాడు. నాకు తెలుసు అన్నయ్య అందుకే ఆ కార్యం మీదనే నేను వెళ్తున్నాను మోక్షాని వశం చేసుకొని పంచమిని మెడలు వంచి ఆ నాగమణి సంపాదించి నిన్ను బ్రతికించుకుంటాను అని నీలాంబరి అంటుంది.నాగమణి మన సొంతం అయితే ప్రపంచంలో మనని ఎదిరించే వాడు ఎవడు ఉండడు చెల్లెమ్మా నువ్వు త్వరగా ఆ నాగమణిని సంపాదించు నేను నా శరీరం దగ్గర రక్షణ కవచంలా ఉంటాను అని నంబూద్రి అంటాడు. నీలాంబరి ఒక శక్తిని ఆశ్రమాన్ని చూసుకోమని చెప్తుంది. కట్ చేస్తే,
మోక్ష వాళ్ళ ఇంటికి గుమ్మడికాయ కట్టించి పూజ చేయిస్తారు. అమ్మ ఒక నెలరోజుల దాకా ఈ గుమ్మడికాయ గుమ్మానికి ఉండనివ్వండి ఆ తరువాత నేను వచ్చి తీసి బజార్లో పగలగొడతాను అప్పుడు ఇంట్లో ఉన్న దిష్టి అంతా పోతుంది అని పంతులుగారు చెప్తాడు. అలాగే పంతులుగారు అని శబరి పంచమి పంతులు గారికి దక్షిణ తెచ్చి ఇవ్వు అని అంటుంది. పంచమి దక్షిణ ఇస్తుంది. పంతులుగారు వెళ్ళిపోతారు. నువ్వేమన్నా దానకర్ణుడికి చెల్లెలు అనుకుంటున్నావా కట్టలు కట్టలు దానం ఇచ్చేస్తున్నావ్ అని చిత్ర అంటుంది.
గుడిలో చిల్లర అడుక్కునే దానికి డబ్బుల విలువ ఏం తెలుస్తుంది చిత్రా అని జ్వాల అంటుంది. చూడండి పంచమి ఇంటికి కోడలు దానమిచ్చే హక్కు తనకు ఉంది అని రఘు వాళ్ళ చెల్లెలు అంటుంది. పాములు పట్టే దానికి పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుంది అక్క మనమే మన ఊరికే వచ్చామా కట్టలు తీసుకొని వచ్చాము అని చిత్ర అంటుంది. వీళ్ళతో మనకెందుకు పదండి వెళ్దాం రా నాన్న అని మోక్షను తీసుకొని వెళ్ళిపోతుంది శబరి. కట్నం గురించి మాట్లాడితే చాలు అందరూ నోరు మెదపకుండా వెళ్ళిపోతారు అని జ్వాల అంటుంది. కట్ చేస్తే, నీలాంబరి ఒక అందమైన రూపాన్ని ధరించి సూట్ కేస్ పట్టుకొని మోక్ష వాళ్ళ ఇంటికి వస్తుంది..
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!