YS Sharmila: కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్దమని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్తున్నట్లు ఆమె చెప్పారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియ, తల్లి విజయమ్మతో కలిసి ఇవేళ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని షర్మిల నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. తమ పార్టీ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. దాదాపు 31 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించడానికి తాము పోటీ పెట్టకపోవడమే కారణమని చెప్పారు.
తమ త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని అన్నారు. తమ త్యాగాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిందని తెలిపారు. పార్టీ హైకమాండ్ పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీకి వెళుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ అని అన్నారు. ప్రజలందరికీ భద్రత, భరోసా కల్పించే పార్టీ కాంగ్రెస్ అని అందుకే కాంగ్రెస్ తో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.
ఎఐసీసీలో పదవి ఇస్తున్నారా, పీసీసీ బాధ్యతలు స్వీకరించనున్నారా అన్న దానిపై రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయని చెప్పారు. తన కుమారుడి వివాహం సందర్భంగా వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపాయకు వచ్చినట్లు షర్మిల వివరించారు.
BJP: లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు ఉండదని మరో సారి స్పష్టం చేసిన బీజేపీ కీలక నేత