Madhuranagarilo January 2nd 2024 Episode 251: శ్యామ్ ఇంత లేట్ ఎందుకు అయింది రా అని మధుర అడుగుతుంది. అమ్మ ఆఫీసులో వర్క్ ఉండి లేట్ అయిపోయింది టైం చూసుకోలేదు అని శ్యామ్ అంటాడు. ఆఫీసులో లేట్ అయినప్పుడు రాధ కి ఫోన్ చేసి చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని మధుర అడుగుతుంది. చెప్పాను కదా అమ్మ ఆఫీస్ వర్క్ లో పడి టైం కూడా చూసుకోలేదు అని శ్యామ్ అంటాడు. ఎంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నాడు అని రాదా అనుకుంటుంది. సరే నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రండి డిన్నర్ చేద్దాం అని రాదా అంటుంది. శ్యామ్ ఫ్రెష్ అయి డిన్నర్ చేస్తూ ఉంటారు. అమ్మ ఈ వంటలు ఎవరు చేశారో చాలా అద్భుతంగా ఉన్నాయి అని శ్యామ్ అంటాడు. వంటలన్నీ మీ ఆవిడే చేసింది రా అని మధుర అంటుంది. టమాట పప్పు కూడా చాలా సూపర్ గా ఉంది అమ్మ అమృతంలా ఉంది అని శ్యామ్ అంటాడు. అది కూడా మీ ఆవిడే వండింది అని మధుర అంటుంది.
ఏంటమ్మా రాధా మీ ఆయన వంటలు బాగా చేశావని మెచ్చుకుంటుంటే సైలెంట్ గా పని చేసుకుంటున్నావు అని దాక్షాయిని అంటుంది. మనం చేసే వంటలు వాళ్లకు ఎలాగైనా నచ్చుతాయి పిన్ని అలాగని మనం మెచ్చుకుంటే వాళ్ళు ఏం చేసినా మనం వోర్చుకోవాల్సి ఉంటుంది అని రాధా అంటుంది. అదేంటమ్మా అలా అంటావ్ అని దాక్షాయిని అంటుంది. అవును పిన్ని ఇప్పుడు వాళ్ళ పొగడ్తలకు పడిపోతే ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినా సరే మనం చూస్తూ ఊరుకోవాలి అప్పుడు అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అయిపోవాలి అందుకే పొగడ్తలకు పొంగిపోకూడదు అని రాదా అంటుంది.కట్ చేస్తే,ఏంటి రాధా డల్ గా ఉన్నావు ఒంట్లో బాలేదా అని శ్యామ్ అంటాడు. ఒంట్లో బాగానే ఉంది మనసే ఏం బాగోలేదు అని రాదా అంటుంది.అదేంటి రాధ నీ మనసు బాగాకపోవడమేంటి ఏం జరిగిందో చెప్పు నాతో చెప్పుకోకూడదా అని శ్యామ్ అంటాడు. మనం నమ్మే వాళ్ళు అబద్ధం చెప్తే తట్టుకోలేము నేను అబద్ధం ఆడకుండా 100 పెళ్లిళ్లు చేశాను అలాంటిది నాకు ఎవరైనా అబద్ధం చెప్తే నేను తట్టుకోలేను భార్యాభర్తల బంధంలో అబద్ధాలు అని డిష్టరీ ఉండకూడదు అని రాదా అంటుంది.
ఇప్పుడు నీకు అబద్ధం ఎవరు చెప్పారు రాధా అని శ్యామ్ అంటాడు. ఆ ప్రశ్న నేను అడగాలి మిమ్మల్ని మీరు ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి అని రాధా కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటి రాధా ప్రవర్తనలో మాట తీరు చాలా తేడాగా ఉంది రుక్మిణి ఆఫీసులో ఎంత టార్చర్ పెట్టిన ఇంటికి వచ్చేసరికి రాదను చూస్తే నా టెన్షన్ అంతా పోయి సంతోషంగా ఉంటాను అలాంటిది రాదా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేక పోతున్నాను కారణం ఏమై ఉంటుంది తెలుసుకుంటాను అని శ్యామ్ కిరణ్ కి ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే, రేశ్యామ్ నువ్వు టెన్షన్ పడడం చూసి రాదా నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టిందేమో ఆ విషయంలో రాధకి నిజం తెలిసేలోపు నువ్వే నీ మొదటి భార్య రుక్మిణి గురించి చెప్పారా ఆఫీసులో కూడా ఉద్యోగం ఇచ్చానని చెప్పు ఎవరి ద్వారానో రాధకి నీ మొదటి భార్య గురించి తెలిస్తే చాలా హర్ట్ అయ్యి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అలా జరగకూడదు అంటే ముందు నువ్వే తనకి నిజం చెప్పే రా అప్పుడు రాద నిన్ను అర్థం చేసుకుంటుంది జీవితాంతం నీతో కలిసి ఉంటుంది అని కిరణ్ అంటాడు.
అలాగే రా నేను రాధకి నా మొదటి భార్య గురించి చెప్పేస్తాను తనని బాధ ఎప్పుడూ పడనివ్వను తనని సంతోషంగా చూసుకుంటాను రా అని శ్యామ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, శ్యామ్ అక్కడికి వెళ్లేసరికి రాధా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు రాదా నువ్వు మెలకువతో ఉన్నప్పుడు కూడా ఇంతే ప్రశాంతంగా ఉండాలి ఉండేలా చేస్తాను రేపు ఆ నిజం చెప్పి నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను అని శ్యామ్ పడుకుంటాడు. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది రాధా పూజ చేసి హారతి ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తుంది.
ఇంతలో శ్యామ్ వస్తాడు అమ్మ రాధా శ్యామ్ కూడా హారతివ్వు అని మధుర అంటుంది. పర్వాలేదమ్మా అని శ్యామ్ అంటాడు. రాధా హారతి ప్లేట్ అక్కడ పెట్టేసి మావయ్య నీకు టీ కలుపుకోస్తాను అని రాదా వెళ్తుంది.అమ్మ రాధ తో నేను మాట్లాడుతాను అని శ్యామ్ వెళ్తాడు. రాధా ఏమైంది ఎందుకలా ఉన్నావు అn శ్యామ్ అంటాడు. నీకు కూడా కాపీ కావాలా టీ కావాలా మావయ్యతో పాటు పెడతాను అని రాధా అంటుంది. రాధా నీతో నేను మాట్లాడాలి అని శ్యామ్ అంటాడు. ఏం మాట్లాడాలో చెప్పండి అని రాదా అంటుంది.
ఇక్కడ కాదు రాధా బయటికి వెళ్దాం రా అని శ్యామ్ అంటాడు. ఎక్కడికి రాను ఏదైనా సరే ఇక్కడే మాట్లాడండి అని రాదా అంటుంది. రాధా నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నేను చెప్పబోయేది విన్నాక మన ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాయి నువ్వు రా రాధా అని శ్యామ్ తీసుకువెళ్లి కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. మధురా ధనంజయ్ ఏం జరుగుతోందండి అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని మధుర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది