YSRCP: ఏపి కోటాలో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికలు శుక్రవారం పూర్తి అయ్యాయి. నాలుగు స్థానాలకు నలుగురే నామినేషన్లే వచ్చిన నేపథ్యంలో నామినేషన్లు దాఖలు చేసిన నలుగు వైసీపీ అభ్యర్ధులు విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రిజర్నింగ్ అధికారి నుండి నలుగురు అభ్యర్ధులు రాజ్యసభకు ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు డిక్లరేషన్ ను అందుకున్నారు.
రాజ్యసభ లో ఖాళీ కానున్నస్థానాలకు ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు. కాకపోతే శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసే సమయానికి ఏపి కోటాలోని నాలుగు స్థానాలకు నలుగురి నామినేషన్లు మాత్రమే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అజెండా మేరకు పని చేస్తామని చెప్పారు. ఏపి అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ పని చేస్తున్నారని ఈ సందర్బంగా పేర్కొన్నారు. సీఎం జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.