ప్రస్తుత రోజుల్లో కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో భర్తకి ఎంతో విలువ ఉండేది భార్య దగ్గర. అయితే ఉన్న కొద్దీ టెక్నాలజీ రావడంతో మనుషుల ఆలోచనలు మరియు బంధాలలో అనేక మార్పులు రావడం జరిగాయి. తోడబుట్టిన వారితో కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకొని రోజుల్లో బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది భార్యాభర్తలు అభద్రతాభావంతో బతకాల్సిన సమాజంలో సంసార జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో మొగుడికి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందని ముంబైలో భార్య పసిగట్టి రెడ్ హ్యాండెడ్ గా ముంబాయి నడిరోడ్డుపై మొగుడుని పట్టుకోంది.
పరాయి అమ్మాయి పక్కన ఉండగానే అది ముంబై నగరం కారులో అందరూ చూస్తుండగానే భార్య పట్టుకోవడం తో అక్రమ సంబంధం బయట పడింది. వెంటనే భార్య కారును ఆపేసి తనని మోసం చేసిన భర్త ని తన్నుతూ ఆగ్రహం ప్రదర్శించింది. ఇంతలో కారులో ఉన్న మహిళ డ్రైవింగ్ చేస్తూ తప్పించుకునేందుకు ట్రై చేయగా.. సదరు వివాహిత తన కారులో ఆమెను వెంబడించింది. సిగ్నల్ దగ్గర ఆమె కారు ఆగగానే కిందకు లాగి దాడి చేసేందుకు యత్నించింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు రావడంతో ఇద్దరికి చలానా విధించి, అనంతరం భార్య భర్తలను మరియు మరొక మహిళను పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు.