ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నియోజకవర్గంలో వైకాపా పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కార్యకర్తలు రెండుగా చీలి పోవడంతో భారీ స్థాయిలో ఒకరి ముఖం పై మరొకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఆకుల పేట ప్రాంతం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం వచ్చిన తమ్మినేని సీతారాం…. శంకుస్థాపన చేసి వెళ్లిపోయిన తర్వాత, వైకాపా కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
జరిగిన దాడికి సంబంధించి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ గొడవ ని చూసి తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు రాయలసీమ సంస్కృతిని జగన్ ఉత్తరాంధ్రలో ప్రవేశపెడుతున్నడు అని విమర్శలు చేస్తున్నారు. మరోపక్క ఈ కార్యక్రమానికి వచ్చిన స్థానిక ప్రజలు గొడవలు చూసి అసహనానికి లోనయ్యారు. తర్వాత ఈ సంఘటన తెలుసుకొని స్పీకర్ తమ్మినేని సీతారాం ఇరువర్గాలను పిలుచుకొని మందలించినట్లు సమాచారం.