Pooja Hegde: బుట్టబొమ్మ పూజాహెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన ఈ అమ్మడు బంపర్ ఆఫర్లు కొట్టేస్తుంది. వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఈ బ్యూటీ ఉంది. టాలీవుడ్ లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లేనే ఎన్టీఆర్,ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోకి కూడా ఈ అమ్మడు అడుగుపెట్టి అక్కడ కూడా అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విమానంలో ఘోర అవమానం
ప్రస్తుతం టాలీవుడ్ లోని హీరోయిన్లలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన బ్యూటీగా పూజాహెగ్దే ఉంది. రాధేశ్యామ్ ఫ్లాఫ్ అయినా… ఈ అందాల నటికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అయితే ఈ భామకు తాజాగా విమానంలో ఘోర అవమానం చోటుచేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసభ్యకరంగా ప్రవర్తించిన ఇండిగో సిబ్బంది
ఇటీవల ఇండిగో విమానంలో పూజాహెగ్దే ప్రయాణించింది. ఈ సందర్భంగా విపుల్ నకాషే అనే వ్యక్తి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మిస్ బీహేవ్ చేసి బ్యాడ్ గా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని పూజాహెగ్దే తన ట్విట్టర్ లో వెల్లడించడంతో బయటపడింది. ముంబై నుంచి ప్రయాణిస్తుండగా విపుల్ నకాష్ అనే వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, రూడ్ గా బీహేవ్ చేశాడని పూజా ట్విట్టర్ లో పేర్కొంది. తనను బెదిరించాడని చెప్పుకొచ్చింది.
క్షమాపణలు చెప్పిన ఇండిగో
ఇలాంటి విషయాల గురించి తాను అసలు ట్వీట్ చేయనని, కానీ అతడి ప్రవర్తనతో చాలా భయమేసిందని పూజా ట్విట్టర్ లో తెలిపింది. దీంతో ఈ ట్వీట్ బాగా వైరల్ కావడంతో చివరకు ఇండిగో యాజమాన్యం స్పందించింది. పూజాకు క్షమాపణలు చెప్పింది. బిస్ బీహేవ్ చేసిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!