యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం నిర్మాతలు అంచనా వేస్తున్న బడ్జెట్ లెక్కలు టోటల్ గా “బాహుబలి” ని మించిపోయే విధంగా ఉన్నాయని, ఒక విధంగా చెప్పాలంటే “ఆదిపురుష్” సినిమా ముందు “బాహుబలి” బడ్జెట్ జూజూబి అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎక్కువగా ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కోసం రెండు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారట.
“బాహుబలి” రెండు సినిమాల కోసం దాదాపు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కోసం 200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే దానికి మించి ఈ సినిమాలో నిర్మాతలు ఖర్చు చేయబోతున్నారట. మొత్తంమీద చూసుకుంటే ఈ “ఆది పురుష్” సినిమా కి వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. అంతేకాకుండా సైఫ్ ఆలీ ఖాన్ సినిమాలో రావణుడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఏక కాలంలో ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడ ఇతర భాషల్లోకి అనువాదం చేయనున్నట్లు త్రీడీ యాక్షన్ తరహాలో సినిమా ఉంటుందని సమాచారం.
అంతేకాకుండా సినిమా లో భారీ సెట్లు, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ ఉండేలా నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారట. ఈ సినిమాని గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిలింస్ సమర్పణలో రెట్రోఫిలిస్ ప్రొడక్షన్, టి-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా “సాహో” సినిమా ప్లాప్ అయిన తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్డేట్ చాలా సమయం పడుతున్న తరుణంలో, ఎవ్వరూ ఊహించని విధంగా అనుకోకుండా ప్రభాస్ బాలీవుడ్ సినిమాతో ఊహించని రీతిలో ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వడంతో… అభిమానులు షాక్ లోనే ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు విని ఇదంతా నిజమేనా అని డిస్కషన్లు చేసుకుంటున్నారట. మరొక పక్క ప్రస్తుతం డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెలుగులో “రాదే శ్యాం” అనే సినిమా ప్రభాస్ చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే “ఆది పురుష్” ప్రాజెక్ట్ ప్రభాస్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!