తెలుగు సీనియర్ నటి శ్రీలక్ష్మి రిలేషన్ అయిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, తొలినాళ్లలో తమిళంలో మంచి క్రేజ్ను సంపాదించుకుంది. క్రమంగా తెలుగు సినిమాల్లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఓ సందర్భంలో ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. విక్రమ్ హీరోగా నటించిన సామి సీక్వెల్ `సామి స్క్వేర్`లో ఐశ్వర్యరాజేష్ ఓ హీరోయిన్గా నటించింది. అయితే ఈ పాత్ర గురించి మాట్లాడుతూ నిజానికి తాను ఆ పాత్రను చేయాలనుకోలేదని, పర్సనల్గా రిక్వెస్ట్ చేయడంతో సినిమాలో నటించానని, తనకు రెండు సాంగ్స్, కొన్ని రొమాంటిక్స్ సీన్స్లో కనపడే హీరోయిన్ పాత్రలు చేయాలని లేదని, మంచి గుర్తింపు దక్కే పాత్రలను చేయాలనుకుంటున్నానని అన్నారు ఐశ్వర్య రాజేష్.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!