Mahesh-Bunny: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ల మోతమోగించారు. అసలు ఉన్నట్లుండి బన్నీ మహేశ్పై ప్రశంసలు కురిపించడానికి కారణం ఏంటీ అంటే.. నిన్న విడుదలైన `మేజర్` సినిమానే. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తొలి పాన్ ఇండియా చిత్రమే `మేజర్`.
2008 ముంబై ఉగ్రవాదుల దాడుల్లో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి మహేశ్ బాబు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉన్నారు. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ లో నిర్మితమైన ఈ మూవీ జూన్ 3న అట్టహాసంగా విడుదలై మంచి స్పందనను దక్కించుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినిమా చూసిన వారందరూ `మేజర్` ఓ అద్భుతమంటూ కొనియాడుతున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ మూవీపై ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా బన్నీ కూడా ఈ లిస్ట్లో చేరారు. `మేజర్ ఓ హార్ట్ టచింగ్ ఫిల్ట్. చిత్ర టీమ్ మొత్తానికి అభినందనలు. అడివి శేష్ వన్ మ్యాన్ షో చేశాడు. మరోసారి తన మ్యాజిక్ను చూపించాడు. ప్రకాశ్ రాజ్గారు, రేవతగారు, శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ తమదైన నటనతో సినిమాకు బలంగ నిలిచారు. డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా టేకింగ్, శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం మైండ్ బ్లోయింగ్` అంటూ బన్నీ వరుస ట్వీట్లు చేశారు.
అలాగే మేజర్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మహేశ్ బాబుని బన్నీ ప్రత్యేకంగా పొగిడారు. హృదయాలను హత్తుకునే గొప్ప చిత్రం నిర్మించినందుకు మహేశ్ గారికి నా స్పెషల్ రెస్పెక్ట్ అన్నారు. మేజర్ ప్రతి భారతీయుడిని తాకే సినిమా అంటూ కొనియాడారు. దీంతో బన్నీ ట్వీట్స్ కాస్త వైరల్గా మారాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!