యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితురాలే. తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుగులేని ఫాలోయింగ్ అనసూయ సొంతం చేసుకుంది. 35 సంవత్సరాల కంటే వయస్సు ఎక్కువ ఉన్నాగాని.. తోటి కుర్ర యాంకర్లకు పోటీ ఇవ్వటంలో తగ్గేదేలే అన్నట్టు రాణిస్తున్నది. సోషల్ మీడియాలో కూడా అనసూయ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అనసూయ ఫోటో పోస్ట్ అయిందంటే చాలు లైక్ లు మీద లైక్ లు పడతాయి.
మహానటి సావిత్రి చేసిన పాత్రలో.. వేశ్యగా యాంకర్ అనసూయ
ఇక ఇదే సమయంలో కొద్ది సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో కూడా అనసూయ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో.. రంగమ్మత్త పాత్రలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ రానేస్తున్నాను తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో “రంగమార్తాండ”.. లో కీలక క్యారెక్టర్ చేయడం జరిగింది. త్వరగా ఈ సినిమా రిలీజ్ అవ్వటానికి సిద్ధంగా ఉండటంతో అనసూయ తాజాగా “రంగమార్తాండ” సినిమాలో.. తన పాత్రకి సంబంధించి డబ్బింగ్ స్టార్ట్ చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో అనసూయ మరోపక్క ఓటీటీ లలో.. వెబ్ సిరీస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనసూయ కి మంచి ఫాలోయింగ్ ఉండటంతో పలు ఓటీటి సంస్థలు ఇప్పటికే అనసూయని కలిసినట్లు కొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్లు టాక్. మొత్తం మీద చూసుకుంటే అనసూయ ఒకపక్క బుల్లితెరపై మరోపక్క వెండి ధరపై ఇక లేటెస్ట్ గా ఓటిటిలో కూడా దూసుకుపోతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!