రంగస్థలం రంగమ్మత్తతో జనాలను మెప్పించిన స్టార్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాతో తన భావాన్ని పంచుకున్నారు. తన కొడుకు అన్న మాటకు ఆమెకు ఏడుపొచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. మరి తన కొడుకు అన్న మాటేమిటో చూసేయండి.. కంటికి కూడా కనిపించని వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తుంది. దీనితో పోరాటం చేయలేని దేశాలంటూ ఏమీ లేవు. లక్షల మందిని తన ప్రాణాన పెట్టుకుంటూనే ఉంది.
ప్రపంచ దేశాలన్నీ దీనితో యుద్ధం చేస్తూనే ఉన్నాయి. 2020 సంవత్సరంలో వచ్చినంత దుర్భర పరిస్థితి ఎప్పుడూ చూడనిది. మనిషికి మనిషికి దూరం చేసి అంటరాని తనాన్ని తీసుకొచ్చింది. ఎన్నడూ లేనంతగా నిరుద్యోగాన్ని, ఆకలి చావుల రుచి చూపించిన ఘనత మాత్రం కరోనాకే దక్కింది.. ఈ కరోనా విజృంభిస్తున్నది చాలదన్నట్టు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను అతలాకుతలం చేసేస్తున్నాయి.
రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. తినడానికి తిండి కూడా లేకుండా దీన స్థితికి చేర్చింది ఈ వాన. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు వర్షం తెచ్చిన బీభత్సానికి కొట్టుకుపోయాయి. మరెన్నో గ్రామాలు ముంపునకు గురయ్యాయి. హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేనే లేదు. హైదరాబాద్ రోడ్లన్నీ కాలువలయ్యాయి. చెరులన్నీ సముద్రంలా మారాయి. కొన్ని చెరువులు తెగిపోయాయి. అనేక మంది రోడ్డున పడ్డారు.
ఈ వరుస ఘటనలు పిల్లలపై కూడా పడ్డాయని చెప్పడానికి అనసూయ చెప్పిన మాటలే దీనికి నిదర్శనమయ్యాయి. 9 సంవత్సరాల అనసూయ కొడుకు ఆమెతో 2017, 18 సంవత్సరాల వెనుకకు వెళ్లాలని ఉందంటూ అన్నాడటా. అలాగే అప్పడు కరోనా లేదు, వరదలు లేవు, అప్పడే హ్యాపీగా ఉన్నామని అన్నాడట. దానికి అనసూయ ఏడ్చేసిందట. వాతావరణంలో మార్పుల మూలంగా అనేక విపత్తులు సంభవిస్తూ రాబోయే తరాల పరిస్థితి మరింత గోరంగా ఉంటుందని ఆమె ఆమెదన వ్యక్తం చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!