తెలుగు రియాలిటీ షో `బిగ్బాస్ 3` మంచి ప్రేక్షకాదరణతో ముందుకు సాగుతుంది. నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో ఇప్పటికే 6 వారాలను కంప్లీట్ చేసుకుంది. గత వారం ఎలిమినేషన్ లేదు. ఐదు ఎలిమినేషన్స్ ముగిశాయి. ప్రస్తుతం నాగార్జున స్పెయిన్లో ఉన్న కారణంగా షోను ఆయన స్థానంలో రమ్యకృష్ణ హోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బిగ్బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందనే వార్తలు బలంగా వినపడుతున్నాయి. ఇప్పటికే ఓసారి వైల్డ్కార్డ్ ఎంట్రీ జరిగింది. సింహాద్రి తమన్నా వైల్డ్కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. ఎలిమినేట్ కూడా అయ్యారు. మరి ఈసారి ఎవరు వైల్డ్కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారు? అనే దానిపై పలు వార్తలు వినపడుతున్నాయి. శ్రద్ధాదాస్, ఈషా రెబ్బా పేర్లు ప్రముఖంగా వినపడ్డాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేర యాంకర్ శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారని టాక్. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!