కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ స్వయం ప్రతిపత్తి విషయంలో ఆర్టికల్స్ 370, 35Aలను క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంట్ కొన్ని పార్టీలు తమ నిరసన గళాన్ని వినిపించాయి. ముందు నుండి కేంద్ర ప్రభుత్వ విధానాలను ముందు నుండి వ్యతిరేకిస్తూ వస్తున్న వారిలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒకరు. ఈ కారణంగా ఆయన చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో కొంత మంది ఆయన్ని టార్గెట్ చేసి ట్రోల్ కూడా చేశారు. కొందరు ఆయన కూతురిని బెదిరించారు కూడా. తాజాగా ప్రభుత్వం కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలను ట్విట్టర్ వేదికగా అనురాగ్ మరోసారి తనదైన శైలిలో ఖండించారు. దీంతో మరోసారి ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. దీంతో అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ నుండి బయటకు వచ్చేశారు.
“నేను నిరసన తెలుపుతున్న ప్రతిసారి నా తల్లిదండ్రులు, కుమార్తె బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి నేను ఇకపై మాట్లాడాలనుకోవడం లేదు. దౌర్జన్యకారులు, బెదిరింపుదారులదే రాజ్యమవుతుంది. నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పలేనప్పుడు నేను మౌనంగా ఉండటమే మంచింది. సరికొత్త భారతదేశంలో నివసిస్తున్న అందరికీ శుభాకాంక్షలు. అందరూ అభివృద్ధిలోకి వస్తారు“ అంటూ అనురాగ్ కశ్యప్ చేసిన చివరి ట్వీట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!