Anushka: టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ అనుష్క శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలు చేయడం బాగా తగ్గించేసిన ఈ బ్యూటీ.. చెఫ్గా మారబోతోందట. అయితే రియల్గా కాదండోయ్.. రీల్గానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `నిశ్శబ్దం` తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క గత ఏడాది తన బర్త్డే నాడు యూవీ క్రియేషన్స్ బ్యానర్పై తన తదుపరి చిత్రాన్ని ప్రకటించింది.
ఇది అనుష్కకు 48వ సినిమా. పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. `మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి` అనే టైటిల్ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదేంటంటే.. ఈ చిత్రంలో అనుష్క నేషనల్ వైడ్గా ఫేమస్ అయిన చెఫ్ పాత్రలో నటిస్తోందట. అలాగే నవీన్ పోలిశెట్టి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నాడట. ఇప్పటికే తన కామెడీ టైమింగ్ తో యూత్కు బాగా చేరవైన నవీన్ పొలిశెట్టి.. ఈ సినిమాలో మరింత ఎనర్జిటిక్ పర్ఫెమెన్స్తో అలరించబోతున్నాడట.
మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఇప్పటికే అనుష్క శెట్టి రెండు సినిమాలు చేసింది. అందులో ఒకటి మిర్చి కాగా.. మరొకటి భాగమతి. ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్పై అనుష్క హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!