Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య బాబు తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున కొడుకులు వారసులకు రంగంలోకి దిగి ఇప్పటికే తమకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. దీంతో బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా సినిమాల్లోకి వస్తాడని గత సంవత్సరం పలు ఇంటర్వ్యూలలో బాలకృష్ణ తెలియజేయడం జరిగింది. అదే సమయంలో “ఆదిత్య 369” తరహా సబ్జెక్టుతో.. తన కొడుకు మోక్షజ్ఞనీ స్వయంగా బాలయ్య దర్శకుడిగా మారి డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడం జరిగాయి.
అయితే ఈ వార్తలు వచ్చి ఏడాది కాగా తాజాగా… అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మూడోవ ఎపిసోడ్ కి శర్వానంద్ తోపాటు అడవి శేష్ వచ్చారు. ఈ ఇద్దరు కుర్ర హీరోలతో బాలయ్య బాబు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అనేక జోకులు వేయడంతో పాటు వ్యక్తిగత విషయాలు ఇంక అన్నీ కూడా చాలా సరదా సంభాషణలో శోపయాసక్తి వచ్చే రీతిలో బాలయ్య నడిపించారు. దీనిలో భాగంగా శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు “ఆదిత్య 369” సినిమా గుర్తొచ్చిందని బాలయ్య తెలియజేశారు. అంతేకాకుండా తాను రాసిన “ఆదిత్య 999 మ్యాక్స్” వచ్చే ఏడాది తీసుకున్నట్లు పేర్కొన్నారు.
దీంతో కొడుకు సినిమా కోసం బాలయ్య స్టోరీ రెడీ చేసినట్లు ఆయన దర్శకుడిగా మారుతున్నట్లు ఈ మాటలు బట్టి బయట సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటినుండో నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే సంవత్సరం ఖాయం అన్నట్టు తెలుస్తుంది. సరిగ్గా స్వర్గీయ నందమూరి తారకరామారావు 100వ జయంతి నాడు సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు కూడా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!