Khushi: ఎస్.జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన “ఖుషి” విడుదల అయి 21 సంవత్సరాలు కావడంతో భూమిక సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. 2001వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇండస్ట్రీలో మరింతగా పెరిగింది. రొమాంటిక్ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్, భూమిక మధ్య జరిగే కెమిస్ట్రీ సినిమా మొత్తానికి హైలెట్. ఫైట్లు కూడా చాలా స్టైలిష్ గా అప్పటివరకు ఏ హీరో చేయని విధంగా ఉంటాయి. ఒకరికి తెలియకుండా మరొకరు గాఢంగా ప్రేమలో ఉంటూ.. చెప్పుకోకుండా…ఈగోతో… నడిచే ఖుషి స్టోరీ అప్పట్లో సంచలనం సృష్టించింది. 100 రోజులకు పైగానే చాలా సెంటర్లలో ఈ సినిమా ఆడింది. అయితే ఈ సినిమా విడుదలయ్యే 21 సంవత్సరాలు కావడంతో తాజాగా… భూమిక సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. కెరీర్ పరంగా భూమికా కి “ఖుషి” రెండో సినిమా అయినా గాని.. బ్లాక్ బస్టర్ పడింది. 21 సంవత్సరాల “ఖుషి” బోలెడన్ని తీపి జ్ఞాపకాలు.. మర్చిపోలేని ప్రయాణం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నా సినిమా కెరీర్ లోనే మర్చిపోలేని క్యారెక్టర్. అని తెలియజేస్తూ హీరో పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ ఎస్.జె సూర్య కి.. ప్రసాద్ అనే వ్యక్తికి భూమిక కృతజ్ఞతలు తెలిపింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “ఖుషి”. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ యువతలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. సిద్దు సిద్దార్ధ రాయ్… క్యారెక్టర్ లో పవన్ పలికే డైలాగులు మేనరిజం.. అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సినిమా విడుదలై 21 సంవత్సరాల కావడంతో.. అభిమానులు కూడా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!