Bollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ ఒకరు అని అందరికీ తెలుసు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో దేవీశ్రీప్రసాద్ స్టైలే వేరు. అటువంటి డి.ఎస్.పి మొదటి నుండి సుకుమార్ సినిమాలకు పని చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. డీఎస్పీ సుకుమార్ అంటే ఆ సినిమాలో కచ్చితంగా ఐటెం సాంగ్ డిఫరెంట్ యాంగిల్ లో ఉంటదని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు.
గతంలో వచ్చిన ప్రతి సినిమాలో అదే తరహాలో డిఎస్పి సుకుమార్ కి సాంగ్ ఇవ్వటం జరిగింది. సినిమా ఎలా ఉన్నా గానీ ఐటమ్ సాంగ్ మాత్రం ప్రతి సినిమాలో హైలెట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇదే మాదిరిగా దేవిశ్రీప్రసాద్ “పుష్ప” మొదటి భాగానికి సంబంధించి మ్యూజిక్ మొత్తం సౌత్ ఇండియా తరహా ఫ్లవర్ వుండేలా సాంగ్స్ అందించడం జరిగిందట. కానీ “పుష్ప” రెండో భాగం కూడా తెరకెక్కుతున్న ఉండటంతో ఈసారి మొత్తం టార్గెట్ బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీప్రసాద్ పాటలు అందించడానికి అప్పుడే రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతోంది.
Read More: Bollywood-Satyadev: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో టాలీవుడ్ హీరో.. ఉమామహేశ్వరరావు..!!
చాలా వరకు బాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకునే రీతిలో సినిమా సాంగ్స్ ఉంటాయని మేకర్స్ అంటున్నారు. నార్త్ ఆడియన్స్ ఆకట్టుకునే రీతిలో ఇప్పటికే కొన్ని సాంగ్స్ డిఎస్పీ కంపోజ్ చేసినట్లు .. వాటిలో సెలక్ట్ చేయటానికి సుకుమార్ మరికొంతమంది కూర్చున్నట్లు ఫిలిం నగర్ టాక్. మొదటి సినిమా భాగానికి సంబంధించి షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవడంతో ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉండటంతో రెండోభాగం “పుష్ప” ఎక్కువశాతం బాలీవుడ్ ఇండస్ట్రీని ఆకట్టుకునే రీతిలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.