Allu Arjun: అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అక్టోబర్ మొదటి తారీకు ఉదయం అల్లు స్టూడియోని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు ఫ్యామిలీ ఓపెన్ చేయించడం జరిగింది. అనంతరం సాయంత్రం ఆయన రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇంకా ఇదే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ ఇంకా సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు కామెడియన్ లు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడి చేశారు. తాతగారు చనిపోయాక ఉన్నకొద్ది ఆయనపై మా నాన్నగారికి ప్రేమ పెరుగుతూన్నే ఉంది. 15 సంవత్సరాల క్రితం పుట్టినరోజు వేడుకలు గురించి..ఖర్చు ఎక్కువైపోతున్నాయి..అని మా నాన్నగారితో నేను అన్నాను.దానికి ఆయన..నేను బతికున్నంత కాలం.. తాత గారి వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ఆయన 100వ జన్మదినోత్సవం కూడా చాలా గ్రాండ్ గా చేస్తా.. అని 15 సంవత్సరాల క్రితమే నాన్నగారు చెప్పారు. ఆ రీతిగానే ఇప్పుడు వేడుకలు జరుగుతున్నాయి.. మా నాన్నగారిని చూసి గర్వపడుతున్నాను అని బన్నీ తెలిపారు.
ఇంకా తాతగారు అల్లు రామలింగయ్య చనిపోయాక..₹10 లక్షల ఇన్సూరెన్స్ నాకు వచ్చింది. ఆయనకు ఎనిమిది మంది మనవళ్లు మనవరాలు ఉన్నా.. ఎవరికి రాలేదు. నాకే వచ్చింది. దీంతో అసలు ఈ డబ్బు ఎప్పుడు వేశారు..? అని నేను మొత్తం ఎంక్వేరీ చేసుకుంటూ పోతే నా ఫోర్త్ స్టాండర్డ్ లో ఆయన డిపాజిట్ చేశారు. అప్పుడే ఆయన నాపై..”వీడి జీవితంలో దేనికి పనికిరాడు. నేను చనిపోయాక పరమా వేస్ట్ ఫెలో అవుతాడు. 18 సంవత్సరాలు వచ్చాక..ఈ ₹10 లక్షలు ఉపయోగపడతాయని నమ్మకంతో నాకు వదిలేసి వెళ్లారు. ఆయన దృష్టిలో దేనికి పనికిరాని నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను… అంటూ అల్లు అర్జున్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!