డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన “లైగర్” అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కొన్న బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు.. భారీ నష్టాలు రావడంతో పూరి జగన్నాథ్.. కొంత సొమ్ము కూడా వెనక్కి ఇచ్చినట్లు వార్తలు రావడం జరిగింది. ఈ పరిణామంతో పూరి జగన్నాథ్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది..అని ముంబైలో ఫ్లాట్ నీ కూడా ఖాళీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వస్తున్న ఈ వార్తలపై చార్మి స్పందించింది.
“లైగర్” పరాజయం పాలైన తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించిన చార్మి.. నాలుగు రోజులకే మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తనతో పాటు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఆర్థిక పరిస్థితి దిగజారిందని వార్తలపై స్పందించింది. వస్తున్న ఆ వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. తాము పూరి కనెక్ట్స్ పై ఫోకస్ చేసినట్లు తెలియజేసి “RIP RUMOURS” అని కామెంట్ పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూరీ జగన్నాథ్… “ఇస్మార్ట్ శంకర్” సినిమా సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
“లైగర్” రిలీజ్ అవ్వకముందే విజయ్ దేవరకొండ తో “జనగణమన” సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసేసారు. అయితే “లైగర్” ఫలితానికి “జనగణమన” సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ పరిణామంతో ఇప్పుడు పూరి జగన్నాథ్ “ఇస్మార్ట్ శంకర్” సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. “లైగర్” సినిమాలో హీరో విజయ్ దేవరకొండ న్యాయం చేసిన గాని పూరి జగన్నాథ్ తన మార్కు చూపించలేకపోయాడని.. అందువల్లే సినిమా పోయినట్లు చూసిన జనాలు తెలియజేయడం జరిగింది. మరి పూరి నెక్స్ట్ సినిమా.. విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తాడో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!