బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. బద్రి, నాని, నరసింహుడు చిత్రాల్లో నటించిన ఈమెపై ఓ నిర్మాత కేసు పెట్టారు. ఇంతకు ఆ నిర్మాత ఎవరో తెలుసా!.. అజయ్కుమార్ సింగ్. అమీషా పటేల్, ఆమె బిజినెస్ పార్ట్నర్ కునాల్పై అజయ్కుమార్ పోలీసులకు పిర్యాదు చేశారు. దేశీ మ్యాజిక్ సినిమా కోసం అమీషా పటేల్, కునాల్ కలిసి అజయ్కమార్ వద్ద 2.5 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారట. సినిమా విడుదల కావడం లేదు. కానీ ఎంత అడిగినా తిరిగి ఇవ్వడం లేదట. వడ్డీతో సహా కలిసి ఇచ్చేస్తామని అన్నారు. ఇచ్చిన మూడు కోట్ల రూపాయల చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో అజయ్ సింగ్ అమీషా, కునాల్ని బెదిరిస్తే.. వారు ప్రముఖులతో ఉన్న ఫోటోలను చూపించి బెదిరించారని, డబ్బులు తిరిగి ఇచ్చే ఉద్దేశం తమకు లేదన్నారని అజయ్ కుమార్ సింగ్ కంప్లైంట్లో పేర్కొన్నారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!