KGF 3: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో “కేజిఎఫ్” సినిమాలు అనేక సంచలనాలు సృష్టించటం తెలిసిందే. హాంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అన్ని భాషలలో డబ్ అయి అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. “కేజిఎఫ్” మొదటి భాగం ఎంతటి విజయం సాధించటం జరిగిందో… దానికంటే ఎక్కువగా “కేజిఎఫ్ 2” హిట్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తారీకు విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ₹400 కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించినట్లు లెక్కలు చెబుతున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో…యాష్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్ నీ ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు రెండో భాగం చివరిలో “కేజిఎఫ్ 3” రాబోతున్నట్లు హింట్ ఇవ్వటం జరిగింది. దీంతో ఎప్పటి నుండో అభిమానులు “కేజిఎఫ్ 3” కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నిర్మాత విజయ్ కిరంగదూర్ కీలక ప్రకటన చేయడం జరిగింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం “సలార్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా హోంభలే నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోంది.
అయితే “సలార్” కంప్లీట్ అయిన వెంటనే “కేజిఎఫ్ 3” స్టార్ట్ అవుతుందని చెప్పటంతో అభిమానులు ఫుల్ సంతోషంగా ఉన్నారు. “సలార్”వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తారీకు విడుదల కానుంది. ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కి ఒక్క హిట్టు కూడా పడలేదు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే “సలార్” తర్వాత “కేజిఎఫ్ 3” స్టార్ట్ అవుతుందని నిర్మాత చెప్పటం సంచలనంగా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!