Devatha Serial: జానకమ్మ మాధవ్ అని పిలిచే రాధా ఈమధ్య ఎందుకో బాధపడుతుంది.. ఎందుకో నీకు తెలుసా మాధవ్ అని అడుగుతుంది.. లేదమ్మా అలాంటిది ఏమీ లేదు అని చెబుతాడు మాధవ్.. ఒకవేళ ఆదిత్యకు బిడ్డను ఇవ్వలేదని ఆలోచిస్తుందేమో అని అనగా.. ఆ విషయం కాదు వేరే ఏదో విషయం గురించి ఆలోచిస్తుంది.. ఇంకా ఎవరైనా రాధను బాధపడుతున్నారా అని అనిపిస్తుందని జానకమ్మ చెబుతుంది.. జీవితం మలుపు తిరిగేటప్పుడు కొన్ని బాధలు అనిపిస్తాయి.. వాటి తరువాత చాలా సంతోషం ఉంటుంది అని అంటాడు మాధవ్..
భాగ్యమ్మ ఊరి పొలిమేర దగ్గర ఉన్న తన గ్రామ దేవత దగ్గరకు వెళ్లి తన బాధనంతా చెప్పుకుంటుంది.. ఇన్నేళ్ళు నా కూతురు చనిపోయిందని అనుకున్నా నాకు నా కూతురిని చూపించావు.. ఇప్పటికీ తను బాధ పడుతుందని ఆ కష్టాన్ని నువ్వు తీర్చ లేవా అని అంటుంది.. నువ్వు తీర్చకపోతే ఆ దేవుడమ్మ నా బిడ్డ కష్టాన్ని తీరుస్తుంది.. ఇప్పుడే వెళ్లి ఆ దేవుడమ్మతో రుక్మిణీ బతికే ఉందన్న విషయం చెప్పి తన బాధనంతా చెబుతాను. నా బిడ్డ కష్టం తీరుస్తుంది అనుకుంటూ దేవుడుమ్మ ఇంటికి బయలు దేరుతుంది భాగ్యమ్మా..
రాధా దేవి కళ్ళు మూసి నేనెవరో చెప్పుకోండి అని ఆట పట్టిస్తుంది రాధమ్మ అని పిలుస్తుంది.. ఆ పిలుపు వినగానే రాధా షాక్ అవుతుంది. అదేంటి బిడ్డ కొత్తగా ఈ రాధమ్మ ఏంది.. అలా పిలుస్తున్నావు ఏంది అని అడుగుతుంది.. మరి నువ్వు మా అమ్మ ఓ కాదో.. సచ్చిపోయిన ఆ అమ్మా మాయమ్మో నాకు తెలియట్లేదు అని దేవి అంటుంది.. రాధా దేవికి నిజం చెప్పేస్తుందా లేదా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం..!
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!