టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున అక్కినేని, తమిళ హీరో ధనుష్, అదితిరావు హైదరి కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు డిడి2 అనే వర్కింగ్ టైటిల్ను కూడా పెట్టారు. ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. తెన్నాండల్ సంస్థ నిర్మాణంలో ప్రారంభమైన ఈ సినిమా కొన్ని కారణాలతో ఆగిపోయిందని, ధనుస్అసురన్ అనే సినిమాను ప్రారభించాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఆటకెక్కించలేదట. కొన్ని కారణాలతో సినిమాను హోల్డ్లో పెట్టారంతేనని అంటున్నారు. అసురన్ తర్వాత ధనుష్ ఈ సినిమాను మళ్లీ ట్రాక్ ఎక్కిస్తాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమాలో ఇది రెండోది. అంతకు ముందు పవర్ పాండి సినిమాను ధనుష్ డైరెక్ట్ చేశాడు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!