Prabhas: “బాహుబలి”(Bahubali) సినిమా విజయంతో ప్రభాస్(Prabhas) పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. బాహుబలి విజయం సాధించడంతో ప్రభాస్ మార్కెట్ టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ దాటి దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీంతో ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇండియాలో పలువురు ఇండస్ట్రీ లకు చెందిన టాప్ మోస్ట్ డైరెక్టర్లు నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. ‘
సినిమా హీరోయిన్ లు కూడా ప్రభాస్ పక్కన ఒకసారి నటిస్తే చాలు అన్న విధంగా పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్(Prabhas) జిల్ ఫేమ్ రాధాకృష్ణ(Radhakrishna) దర్శకత్వంలో “రాధేశ్యం”(Radheyshyam) సినిమా చేయటం తెలిసిందే. జనవరి 14వ తారీఖున సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తో పాటు నాగ్ అశ్విన్ ప్రాజెక్టు ఓకే చేయటం తెలిసిందే. కాగా నాగ్ అశ్విన్ సినిమా…వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. దాదాపు 500 కోట్లకు పైగానే ఈ సినిమా బడ్జెట్ ఉంటుందని సమాచారం.
“ప్రాజెక్ట్ కే” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాహుబలి తరహాలోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే బాహుబలి సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం రామోజీ ఫిలిం సిటీ లోనే జరిగింది. ఇప్పుడు ఇదే మాదిరిగా “ప్రాజెక్టు కే” సినిమాకి సంబంధించి షూటింగ్ అత్యధికభాగం రామోజీ ఫిలిం సిటీ లోనే చిత్రీకరించాలని అందుకు గాను ఇప్పటికే పలు భారీ సెట్ లు నాగ్ అశ్విన్… ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా విస్తరిస్తుండటంతో విదేశాలలో ..ఔట్ డోర్ షూటింగ్ ప్రస్తుత పరిస్థితుల్లో అంతా కన్వీనియంట్ కాదని.. మ్యాగ్జిమం షూటింగ్ హైదరాబాద్లోని ఇండియాలోనే కంప్లీట్ అయ్యేలా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!