జెనీలియా కమ్బ్యాక్ ప్లానింగ్స్ సీరియస్గానే జరుగుతున్నాయి. ఆమె ప్రస్తుతం కథలు చదువుతూ బిజీగా ఉన్నారు. తొలి చిత్రం `తుఝే మేరీ కసమ్`తోనే ప్రామిసింగ్ న్యూ కమర్గా స్టార్ స్క్రీన్ అవార్డు అందుకున్నారు జెనీలియా. ఆ వెంటనే శంకర్ `బోయ్స్` లోనూ, రాజమౌళి `సై`లోనూ అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇప్పటికీ తెలుగువారు రెఫరెన్స్ గా తీసుకునే `బొమ్మరిల్లు`లో హాసినిగా ఆమె ఎప్పుడూ గుర్తుంటారు. ఆ తర్వాత `హ్యాపీ`, `ఢీ`, `రెడీ` వంటి పలు చిత్రాల్లో చేశారు. రానాతో నటించిన `నా ఇష్టం` ఆమె నటించిన చివరి తెలుగు చిత్రం. ఆ తర్వాత హిందీ, మరాఠీ చిత్రాల్లో కనిపించారు. తన సహ నటుడు రితేష్ దేశ్ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జెనీలియా. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లల తల్లి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆమె మళ్లీ నటించాలనుకుంటున్నారు. పిల్లలు కాస్త పెద్దవారు కావడంతో ఆమెకు వెసులుబాటు దొరుకుతుందట. అందుకే ఆమె ప్రస్తుతం స్క్రిప్ట్ లు చదువుతున్నారు. మరాఠీ స్క్రిప్ట్ లతో పాటు, ఓటీటీ ప్లాట్ఫార్మ్ ల కోసం ఎక్కువగా స్క్రిప్ట్ లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయట. వాటిలో వేటిని ఎంపిక చేసుకుంటారో వేచి చూడాల్సిందే. ఒక్క సారి మేకప్ వేసుకున్నారంటే, ఇక తెలుగులోనూ మన హాసినిని ప్రామినెంట్ రోల్స్ లో ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!