Siddhartha: తమిళ హీరో ధనుష్ నటించిన “అసురన్” సినిమాని తెలుగులో “నారప్ప” అనే టైటిల్ తో రీమేక్ చేసి ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. అయితే “నారప్ప” సినిమా లో వెంకటేష్ నటనపై తమిళ సినీ ప్రేక్షకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ధనుష్ మాదిరిగా వెంకటేష్ నటించిన లేక పోయాడు అని.. కామెంట్లు చేయటంతో తెలుగు ప్రేక్షకులు వెంకటేష్ లాంటి సీనియర్ హీరో ని ధనుష్ తో పోల్చడం ఏమిటి అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇదే తరుణంలో.. అసలు వెంకటేష్ నటన గురించి ఏం తెలుసు అంటూ తమిళ ప్రేక్షకుల పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దీంతో సోషల్ మీడియాలో ఈ గొడవ పెద్దగా మారి కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్టు మారిపోయింది. ఈ క్రమంలో విజయ్ గొప్పోడు అంటే మరోపక్క ప్రభాస్ గొప్పవాడని, మహేష్ గొప్పోడు అంటే అజీత్ అంతకంటే గొప్పవాడని.. అంటూ తెలుగు తమిళ సినీ ప్రేమికులు ఒకరి నుంచి మరొకరు మిమ్స్ తో కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటున్నారు. గొడవ ఇలా జరుగుతూ ఉండగా మధ్యలో హీరో సిద్ధార్థ ఎంటర్ అయి.. అసలు అభిమానులకి బుద్ధి రావాలి అంటూ సంచలన కామెంట్ చేశారు.
Read More: Venkatesh : వెంకటేశ్ మైల్ స్టోన్ మూవీ డైరెక్టర్ ఎవరు..?
తెలుగు అదే రీతిలో తమిళ సినీ ప్రేక్షకులు ఒకరితో ఒకరు గొడవలు పడటం మానేసి తమ దృష్టిని నెట్ ఫ్లిక్స్ మీద ఫోకస్ చేయాలని కోరారు. సౌత్ ఇండియాలో నాలుగు భాషల సినిమాలకు దీని ప్రత్యేకత దానికి ఉందని అలా కాకుండా అన్నిటికీ.. ఒకటిగా గుర్తించటం కరెక్ట్ కాదని అని.. ఈ విషయంపై నెట్ ఫ్లిక్స్ తో పోరాటం చేయాలని హీరో సిద్ధార్థ సూచించారు. ఇదిలా ఉంటే ఒక హీరో పై మరొక హీరో అభిమానులు చేసిన కామెంట్ లకు మాత్రం సిద్ధార్థ ఎటువంటి బదులివ్వలేదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!